Don't Miss!
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘మాయాబజార్’ విజయోత్సవ వేడుక!
అలనాటి 'మాయాబజార్" చిత్రానికి రంగులు హంగులు దిద్ది గోల్డ్ స్టోన్ టెక్నాలజీ సంస్థ విడుదల చేయడం, ఆ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించడం తెలిసిందే. రంగుల 'మాయాబజార్" 50 రోజుల ప్రదర్శన పూర్తయిన సందర్బంగా ఈ చిత్ర అర్ధ శతదినోత్సవ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అక్కినేని నాగేశ్వరరావు మాట్టాడుతూ మాయాబజార్ చిత్రాన్ని ప్రత్యేకించి ఇప్పుడు రంగులు చేయండం కాదు. ఈ చిత్రం ఎప్పుడూ కలర్ ఫుల్ చిత్రమే. ఈ చిత్రాన్ని రంగుల్లో చూసి నేను ఆశ్చర్య పోలేదు. ఎందుకంటే ఈ సినిమాలోని ఒరిజినల్ కలర్స్ ని నేను సెట్ లోనే చూశాను అని అన్నారు. ఇంత మంచి ప్రయత్నం చేసిన గోల్డ్ స్టోన్ టెక్నాలజీ సంస్థ వారిని ఈ సందర్బంగా అక్కినేని అభినందించారు. ఈ వేడుకలో భాగంగా గోల్డ్ స్టోన్ టెక్కాలజీ సంస్థ అక్కినేని నాగేశ్వరరావు గారిని ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా సుశాంత్ మాట్లాడుతూ ఈ సినిమాను కలర్ లో చూసి చాలా ఆశ్చర్యపోయా అన్నారు. తర్వాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని కలర్స్ లోనికి మార్చి ప్రేక్షకులను ఆనందపరచారన్నారు. తెలుగు సినిమా ఉన్నంత వరకు 'మాయాబజార్ గురుంచి చెప్పుకుంటారిని బీ ఏ రాజు చెప్పారు. చివరిగా సి జగన్మోహన్ మాట్లాడుతూ 'మా ప్రయత్నాన్ని సఫలం చేసి ఈ అపురూప చిత్రాన్ని అపూర్వం గా ఆదరించిన ప్రేక్షకులకు దన్యవాదాలు" అని తెలిపారు.