twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘దర్శకులే హీరోలుగా’ ప్రయోగాత్మక ప్రారంభం

    By Bojja Kumar
    |

    Tollywood Directors
    దర్శకులనే హీరోలుగా చూపిస్తూ ఓసినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. యండమూరి వీరేంద్రనాత్ రాసిన 'అనైతికం" అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. కీర్తన మూవీ మేకర్స్‌ పతాకంపై 'నగరం నిద్రపోతున్నవేళ" ఫేం ప్రేమ్‌రాజ్‌ స్వీయదర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో ఆదివారం ప్రారంభమైంది. దేవుని చిత్రపటాలపై తొలిసన్నివేశానికి బి.గోపాల్‌ క్లాప్‌నివ్వగా, ఎన్‌.శంకర్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. పరుచూరి వెంకటేశ్వరరావు గౌరవదర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా రచయిత పరుచూరి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ... 'దర్శకులనే ముఖ్యపాత్రల్లో నటింపజేయడం సాహసం. తెలుగు తెరపై ఇదో వినూత్న ప్రయోగం. దర్శకుడిని అభినందిస్తున్నా" అన్నారు.

    దర్శకుడు ప్రేమ్‌రాజ్‌ మాట్లాడుతూ 'ఈ నెల 20నుంచి 15రోజుల పాటు రెగ్యులర్‌ చిత్రీకరణ సాగుతుంది. వచ్చే నెలలో మరో షెడ్యూల్‌తో సినిమా పూర్తిచేస్తాం" అన్నారు. రవిబాబు, ఎన్‌.శంకర్‌, వి.ఎన్‌.ఆదిత్య, కాశీ విశ్వనాథ్‌, చంద్రమహేష్‌, సాగర్‌, రాంప్రసాద్‌, ఏవిఎస్‌, ఎం.ఎస్‌.నారాయణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రా నికి కథ: యండమూరి వీరేంద్రనాథ్‌, మాటలు : పరుచూరి బ్రదర్స్, సంగీతం: యశోకృష్ణ, పాటలు: సుద్దాల అశోక్‌తేజ, కెమెరా: డి.జి.వెంకటేష్‌, సమర్పణ: సత్యనారాయణరెడ్డి, నిర్మాత: టి.వెంకటేష్‌ యాదవ్‌.

    English summary
    Yendamuri book based movie has been started on Sunday. In the movie directors acted as heroes. This film directed by Premraj.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X