Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘బాహుబలి’కి ప్రశంసలు....రాజమౌళి ఖుషీ
హైదరాబాద్ : ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న సినిమా ‘బాహుబలి'. ఈ చిత్రానికి ఎస్.ఎస్.రాజమౌళి దర్శకుడు. చిత్రం ప్రారంభం నుంచి అందరి ప్రశంసలూ పొందుతోంది. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. ఇటీవల బల్గేరియాలో పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు. బల్గేరియాలోని భారత రాయబారి రాజేశ్ కుమార్ సచ్దేవ్ ‘బాహుబలి' టీమ్ను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ విషయమై ట్విట్టర్ లో రాజమౌళి షేర్ చేసి తాను చాలా హ్యాపీ ఫీలవుతున్నట్లు తెలిపారు.
https://www.facebook.com/TeluguFilmibeat
నిర్మాతలు మాట్లాడుతూ ‘‘బల్గేరియాలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో భారత రాయబారి రాజేశ్ కుమార్ సచ్దేవ్ తన కుటుంబంతో కలిసి ‘బాహుబలి' సెట్స్ని సందర్శించారు. పోరాట సన్నివేశాల్ని, సెట్స్ని చూసి ఆశ్చర్యపోయారు. ప్రభాస్, తమన్నా, రాజమౌళితోపాటు మా టీమందరితో మాట్లాడారు. భారీ బడ్జెట్తో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా గురించి తెలుసుకుని చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు'' అని తెలిపారు.
సినిమా షెడ్యూల్ గురించి వివరిస్తూ ‘‘సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ప్యాచ్వర్క్, మైనర్ టాకీ, రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. తాజా షెడ్యూల్ఆదివారం రామోజీ ఫిలింసిటీలో మొదలైంది. 2015 వేసవిలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.
మనిషి తలచుకుంటే సాధించలేనిది లేదు. అయితే ఆ తలపు అత్యాశతో కూడినదైతే ఆ మనిషికి రేపు అనేది ఉండదు. ఈ అంశంతో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. గతంలో రాజుల నేపథ్యంలోనూ ఇలాంటి కథలు తీశారు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇలాంటి అంశంతోనే 'బాహుబలి'ని రూపొందిస్తున్నారు.
ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా ప్రధాన పాత్రధారులు. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. ఈ చిత్రానికి కథ: కె.వి.విజయేంద్రప్రసాద్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: సెంథిల్ కుమార్.