twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగాస్టార్ చిరంజీవిపై భారత క్రికెటర్ కామెంట్స్.. అంతకుమించి అంటూ

    |

    ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సైరా ఫీవర్ పట్టుకుంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో మొట్టమొదటి చారిత్రాత్మక చిత్రం కావడంతో, ఈ సినిమా కోసం ప్రేక్షకలోకం వేయి కళ్ళతో ఎదురు చూస్తోంది. ప్రేక్షకులతో పాటు సినిమాయేతర రంగాలకు చెందిన సెలెబ్రిటీలు సైతం 'సైరా' సినిమాపై స్పందిస్తూ చిరంజీవి రేంజ్ ఎలా ఉండబోతోందో చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత క్రికెటర్ శ్రీశాంత్ స్పందించడం, చిరంజీవిపై కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అయింది.

     తన పేరుకు అర్థం చెబుతూ శ్రీశాంత్

    తన పేరుకు అర్థం చెబుతూ శ్రీశాంత్

    తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ తో ఇంటర్వ్యూ సెషన్ లో పాల్గొన్నారు శ్రీశాంత్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తన చిన్నప్పటి పేరు శ్రీ గోపు అని, అదే పేరు ఇప్పుడు శ్రీశాంత్ అయిందని తెలిపాడు. తన పేరులో శ్రీ తనదని, శాంత్ తన తండ్రి పేరు అని చెప్పాడు. ఇదే సెషన్‌లో సైరాపై కూడా ఆసక్తికరంగా స్పందించాడు శ్రీశాంత్.

     'బాహుబ‌లి' క‌న్నా పెద్ద సినిమా 'సైరా'

    'బాహుబ‌లి' క‌న్నా పెద్ద సినిమా 'సైరా'

    సైరా టీజ‌ర్‌, ట్రైల‌ర్స్ చూశానని చెప్పిన శ్రీశాంత్ అవి అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చాడు. చూస్తుంటే 'సైరా' మూవీ 'బాహుబ‌లి' క‌న్నా పెద్ద సినిమాగా అనిపిస్తుందని ఆయన అన్నాడు. రిలీజ్ రోజున కానీ, రిలీజ్ త‌ర్వాత కానీ ఈ సినిమాను త‌ప్ప‌కుండా చూస్తానని ఈ సందర్బంగా పేర్కొన్నాడు శ్రీశాంత్.

    మెగాస్టార్ చిరంజీవి గురించి..

    మెగాస్టార్ చిరంజీవి గురించి..

    ఇక మెగాస్టార్ చిరంజీవివి గురించి మాట్లాడిన శ్రీశాంత్.. హైద‌రాబాద్‌లో ఓ మ్యాచ్ ఆడుతున్న సంద‌ర్భంలో చిరంజీవిని కలిశానని చెప్పాడు. క్రికెట్‌లో స‌చిన్ ఎలాగో.. సినిమాల్లో ర‌జ‌నీ సార్‌, చిరంజీవి సార్ అలాగే. దె ఆర్ లెజెండ్స్‌ అనేశాడు భార్త క్రికెటర్ శ్రీశాంత్‌.

    సైరా టీజర్, ట్రైలర్ సెన్సేషన్.. సెన్సార్

    సైరా టీజర్, ట్రైలర్ సెన్సేషన్.. సెన్సార్

    సైరా నరసింహా రెడ్డి సినిమా టీజర్, ట్రైలర్ ఇప్పటికే నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వ్యూస్ పరంగా సరికొత్త రికార్డులకు తెరలేపుతూ సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టాయి. ఇక సైరా చూసిన సెన్సార్ సభ్యులు సింగిల్ కట్ కూడా లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ అందించారు.

    సైరా నరసింహా రెడ్డి మూవీ

    సైరా నరసింహా రెడ్డి మూవీ

    కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    Periodical drama Sye Raa Narasimhaa Reddy is ready for release on october 2. Since two days uyyalawada family members demanding compensetion from Konidela Production Company. Now Indiam crickter Sreeshanth commented chiranjeevi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X