ఇండియన్ ఐడల్-5 శ్రీరామ్...‘ప్రేమగీమ జాన్తా నయ్’
దాడి బాలభాస్కర్, మద్దాల భాస్కర్ లు నిర్మిస్తున్న ఈచిత్రం ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ 'ఇదొక విభిన్న ప్రేమకథా చిత్రం. ఆద్యంతం నవ్వులు కురిపించే ఈ చిత్రంలో అంతర్లీనంగా యువతకు అవసరమయ్యే చక్కటి సందేశం ఉంటుంది. పూర్తి వాణిజ్య విలువల మేళవింపుతో రూపుదిద్దుకోబోయే ఈచిత్రంలో అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అంశాలు ఉంటాయి' అన్నారు.
హీరో శ్రీరామచంద్ర మాట్లాడుతూ..హీరోగా పరిచయమవుదామనుకున్న తర్వాత అనేక కథలు వినడం జరిగింది. ఏ ఒక్క కథ కూడా నాకు నచ్చలేదు. సుబ్బు చెప్పిన ఈ కథ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. నా పరిచయ చిత్రానికి తగ్గుట్టుగా ఉన్న ఈ కథ ద్వారా నన్ను మంచి నటుడిగా నిరూపించుకోగలనన్న విశ్వాసం పూర్తిగా ఏర్పడింది. ఇదొక అద్భుతమైన చిత్రంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.
నిర్మాతల్లో ఒకరైన భాస్కర్ మాట్లాడుతూ 'నవంబర్ నెలలో చిత్రీకరణ మొదలు పెడతాం. విశాఖ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం' అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎస్. కుమార్.


Click it and Unblock the Notifications












