Don't Miss!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఇండియన్ ఐడల్-5 శ్రీరామ్...‘ప్రేమగీమ జాన్తా నయ్’
దాడి బాలభాస్కర్, మద్దాల భాస్కర్ లు నిర్మిస్తున్న ఈచిత్రం ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ 'ఇదొక విభిన్న ప్రేమకథా చిత్రం. ఆద్యంతం నవ్వులు కురిపించే ఈ చిత్రంలో అంతర్లీనంగా యువతకు అవసరమయ్యే చక్కటి సందేశం ఉంటుంది. పూర్తి వాణిజ్య విలువల మేళవింపుతో రూపుదిద్దుకోబోయే ఈచిత్రంలో అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అంశాలు ఉంటాయి' అన్నారు.
హీరో శ్రీరామచంద్ర మాట్లాడుతూ..హీరోగా పరిచయమవుదామనుకున్న తర్వాత అనేక కథలు వినడం జరిగింది. ఏ ఒక్క కథ కూడా నాకు నచ్చలేదు. సుబ్బు చెప్పిన ఈ కథ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. నా పరిచయ చిత్రానికి తగ్గుట్టుగా ఉన్న ఈ కథ ద్వారా నన్ను మంచి నటుడిగా నిరూపించుకోగలనన్న విశ్వాసం పూర్తిగా ఏర్పడింది. ఇదొక అద్భుతమైన చిత్రంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.
నిర్మాతల్లో ఒకరైన భాస్కర్ మాట్లాడుతూ 'నవంబర్ నెలలో చిత్రీకరణ మొదలు పెడతాం. విశాఖ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం' అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎస్. కుమార్.