Don't Miss!
- News రేపు కామద ఏకాదశి.. ఈ రాశులు పట్టుకుందల్లా బంగారమే
- Automobiles టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Finance EPFO News: ఉద్యోగులకు గుడ్న్యూస్.. మారిన పీఎఫ్ విత్డ్రా రూల్స్.. ఎంతంటే..??
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
- Sports IPL 2024: అంబానీ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
ఆ..సినీ నిర్మాతలకు రైల్వేశాఖ నోటీసులు
షాహిద్ కపూర్, సోనమ్ కపూర్ జంటగా పంకజ్ కపూర్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ మౌసం. ఈ సినిమా నిర్మాతలకు భారత రైల్వే శాఖ నోటీసులు జారీ చేసింది. వారం క్రితం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారితో వచ్చిన సమస్యను పరిష్కరించుకున్న ఫిల్మ్ మేకర్స్...తాజాగా రైల్వే శాఖ నుంచి ఇబ్బందులు ఎదుర్కొనడం గమనార్హం. అసలు రైల్వే శాఖ వీరికి నోటీసులు పంపడానికి కారణం ఏమిటంటే, ఈ సినిమాలో హీరో షాహిద్ కపూర్ ప్రమాదకరమైన రైల్వే క్రాసింగ్ స్టంట్ చేశాడు. దీనిపై సీరియస్ గా స్పందించిన రైల్వే బోర్డు లీగల్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఇక పోతో మౌసం సినిమా రేపు(సెప్టెంబర్ 23)న విడుదలకు సిద్ధం అవుతోంది. కాశ్మీరీ అమ్మాయికి, సిక్కు అబ్బాయికి మధ్య 1970 దశకంలో జరిగే హృద్యమైన ప్రేమకథగా 'మౌసమ్" చిత్రం తెరకెక్కింది. చాలా కాలంగా పెద్ద హిట్లు లేని షాహిద్- సోనమ్ కపూర్ ఈ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. సినిమాలో వీరిద్దరి మధ్య ముద్దుసీన్లు కూడా ఉన్నారు. ఏది ఏమైతేనేం...ఇలాంటి వివాదాలు సినిమాకు మరింత ప్రచారాన్ని తెచ్చి పెడుతున్నాయి.