Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
తెలుగమ్మాయి, తెలంగాణా యాస వచ్చు అందుకే ఆమె: అనుమానాలు తీరేలా ఫుల్ క్లారిటీ ఇచ్చాడు
ఈషా తో ప్రత్యేక అనుబందానికి కారణం ఏమిటీ అని అర్థం వచ్చేట్టు గా అడగటంతో ఇక అపార్థాలని పూర్తిగా తొలగించాలనుకున్నాడో ఏమో ఈ విషయమై ఇంద్రగంటి ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు.
దర్శకుడు ఒక హీరోయిన్ ను తన వెంట వెంట సినిమాల్లో తీసుకుంటే కచ్చితంగా ఇద్దరి మధ్య ఏదో సీక్రెట్ రిలేషన్ ఉందని అనుకుంటారు.ఒక దర్శకుడి సినిమాల్లో తరచుగా ఒకే హీరోయిన్ కనిపించినా జనాలకు లేనిపోని డౌట్లు వచ్చేస్తాయి. వాళ్ల నేపథ్యం ఏంటో కూడా చూడకుండా రకరకాల ఊహాగానాలు పుట్టించేస్తారు. సందేహాలు వ్యక్తం చేస్తారు. ఇంద్రగంటి మోహనకృష్ణ తన సినిమాల్లో ఈషాకు మళ్లీ మళ్లీ కథానాయికగా అవకాశం ఇస్తుండటంతో జనాలకు ఇలాంటి లేని పోని డౌట్లు వచ్చేశాయి.
అంతకుముందు ఆ తరువాత
మోహనకృష్ణ ఇంద్రగంటి సినిమా 'అంతకుముందు ఆ తరువాత'తో ఈషా కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలోనే 'బందిపోటు' చేసింది. ఇప్పుడు ఇంద్రగంటి నుంచి వస్తున్న 'అమీ తుమీ'లోనూ ఆమే హీరోయిన్. మొత్తంగా ఇంద్రగంటి రీసెంట్గా చేసిన నాలుగు సినిమాల్లో మూడింట్లో ఈషానే కథానాయిక.
ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు
ఈషా మీద ఇంద్రగంటి చూపించే ప్రత్యేక అభిమానం గురించి మీడియా వాళ్లకు కూడా డౌట్లు వచ్చేసి.. 'అమీతుమీ'ను ప్రమోట్ చేయడం కసం వచ్చినపుడు ప్రశ్నలు గుప్పించేసారు. ఈ ప్రత్యేక అనుబందానికి కారణం ఏమిటీ అని అర్థం వచ్చేట్టు గా అడగటంతో ఇక అపార్థాలని పూర్తిగా తొలగించాలనుకున్నాడో ఏమో ఈ విషయమై ఇంద్రగంటి ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు.
ఈషా అచ్చ తెలుగు అమ్మాయి
తన పాత్రలకు సరిపోతోంది కాబట్టే ఆమెకు ఛాన్సులిస్తున్నట్లు చెప్పాడు.''ఈషా అచ్చ తెలుగు అమ్మాయి. ఇటు ఆంధ్రా.. అటు తెలంగాణ.. రెండు యాసలూ బాగా మాట్లాడగలదు. ముఖ్యంగా తెలంగాణ యాస మాట్లాడే తెలుగు హీరోయిన్లు చాలా అరుదు. ఆ అమ్మాయి మంచి నటి కూడా.
తనకు సరిపోయే పాత్రలు కాబట్టే
నా పాత్రకు కావాల్సిన అన్ని లక్షణాలూ ఆమెలో ఉన్నాయి. తెలుగు రాని ఓ హీరోయిన్ని తీసుకుని.. తనకు తెలుగు నేర్పించి.. వేరొకరి చేత డబ్బింగ్ చెప్పించి ఇబ్బంది పడటం ఎందుకని ఈషానే 'అమీ తుమీ'కి తీసుకున్నాను. ఇంతకుముందు తనకు సరిపోయే పాత్రలు కాబట్టే తనతో చేయించాను.
తెలుగు నటీనటులకు ఎక్కువ ప్రాధాన్యం
నా సినిమాల్లో ఎక్కువగా తెలుగు నటీనటులే ఉంటారు. నా సినిమాల్లోనూ తెలుగుదనం ఉంటుంది. అందుకే తెలుగు నటీనటులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను'' అంటూ ఈషాకు వరుసగా అవకాశాలిస్తుండటానికి కారణమేంటో చెప్పాడు ఇంద్రగంటి. ఇంత చక్కగా వివరణ ఇచ్చాక అయినా ఈ గాలి రూమర్లు ఆగుతాయేమో చూడాలి మరి.