Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మోహన్ బాబు, బ్రహ్మానందంపై ‘పద్మశ్రీ’ వివాదం
హైదరాబాద్: 'దేనికైనా రెడీ' సినిమాలో పేర్ల ప్రదర్శన సమయంలో నటులు మోహన్ బాబు, బ్రహ్మానందం 'పద్మశ్రీ' అవార్డుకు ఉపయోగించుకున్నారని, ఇది సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధమని బీజేపీ నేత ఇంద్ర సేనారెడ్డి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. వారికి ఇచ్చిన 'పద్మశ్రీ' అవార్డులను వెనక్కి తీసుకోవాలని కూడా ఆయ తన పిటీషన్లో కోరారు.
అదే విధంగా ఒక సామాజిక వర్గం మనో భావాలను దెబ్బ తీసే విధంగా ఉన్న 'దేనికైనా రెడీ' చిత్రానికి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని ఇంద్రసేనారెడ్డి తన పిటీషన్లో కోరాను. ఇప్పటికే 'దేనికైనా రెడీ' చిత్రంపై పలు కేసులు నమోదడంతో పాటు, కోర్టుల్లో పిటీషన్లు దాఖలైన విషయం తెలిసిందే.
మంచు విష్ణు-హన్సిక నటించిన 'దేనికైనా రెడీ' చిత్రం పై వారం రోజుల క్రితం ఆ చిత్ర నిర్మాత మోహన్ బాబుతో పాటు మరో ఏడుగురిపై వరంగల్ జిల్లా జనగామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దేనికైనా రెడీ చిత్రం బ్రాహ్మణుల కించ పరిచే విధంగా ఉందని బ్రాహ్మణ సమాజం సేవా సంస్థ సహాయ కార్యదర్శి వారణాసి పవన్ కుమార్ జనగామ కోర్టులో పిటీషన్ వేసిన నేపథ్యంలో కేసు నమోదు చేసి విచారణ జరుపాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఈ మేరకు చిత్ర నిర్మాత మోహన్ బాబు, హీరో మంచు విష్ణు, నడుడు బ్రహ్మానందం, దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి, సెన్సార్ బోర్డు ఆఫీసర్ ఎ. ధనలక్ష్మి, రచయిత కోన వెంకట్ మరియు వెంకట సుబ్రహ్మణ్యం, బి. రవిలపై కేసులు నమోదయ్యాయి.