Don't Miss!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- News న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
RRR: రాంచరణ్, ఎన్టీఆర్, అజయ్ దేవగన్ ఎంట్రీ సీన్స్ గురించి తెలుసా.. 50 కోట్ల ఖర్చుతో!
మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ జోరందుకుంది. ఆర్ఆర్ఆర్ చిత్ర తదుపరి షెడ్యూల్స్ ఎక్కువగా నార్త్ ఇండియాలో జరగనున్నాయి. పూణే, వడోదర, కోల్ కతా లాంటి నగరాల్లో చరణ్, ఎన్టీఆర్ పై రాజమౌళి కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. రాంచరణ్ కు గాయం కావడంతో షూటింగ్ కొన్నిరోజులపాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో, రాంచరణ్ అల్లూరి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో ప్రధాన నటుల పరిచయ సన్నివేశాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నార్త్లో షూటింగ్
ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కీలక షెడ్యూల్ కోసం వడోదర వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ రాంచరణ్ కు గాయం కావడంతో మూడు వారాల పాటు షూటింగ్ వాయిదా వేశారు. త్వరలో మళ్ళీ ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ నార్త్ ఇండియాకు వెళ్లనుంది. అక్కడ జరగబోయే షెడ్యూల్స్ లో అలియా భట్, అజయ్ దేవగన్ షూటింగ్ లో జాయిన్ కానున్నారు. అలియా భట్ రాంచరణ్ కు జోడిగా నటిస్తోంది. ఎన్టీఆర్ కోసం ఎంపిక చేసిన బ్రిటిష్ హీరోయిన్ డైసీ ఎడ్గార్ జోన్స్ తప్పుకోవడంతో మరో హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నారు.
ఎంట్రీ సీన్స్
ఎన్టీఆర్, చరణ్, అజయ్ దేవగన్ ఎంట్రీ సన్నివేశాల కోసమే చిత్ర యూనిట్ కళ్ళు చెదిరే మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాంచరణ్ ఎంట్రీ సన్నివేశాలని రాజమౌళి చిత్రీకరించారు. ఎన్టీఆర్ పరిచయ సన్నివేశాన్ని తదుపరి షెడ్యూల్ లో చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ హీరోలు కాబట్టి రాజమౌళి అదిరిపోయేలా పరిచయ సన్నివేశాలు ప్లాన్ చేసి ఉంటారు. ఇక అజయ్ దేవగన్ ఎంట్రీ సీన్ కూడా ఒకరేంజ్ లో ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం ఈ ముగ్గురి పరిచయ సన్నివేశాలకే 50 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.
బ్రిటిష్ నేపథ్యంలో
సినిమా కొత్త బ్రిటిష్ నేపథ్యంలో 1920 కాలంలో జరుగనుంది. చిత్ర నేపథ్యాన్ని రాజమౌళి ఇప్పటికే మీడియా సమావేశంలో వివరించారు. అల్లూరి, కొమరం భీం జీవితంలో ఎవరికీ తెలియని అంశాన్ని తాను కల్పిత గాధగా చూపించబోతున్నట్లు ప్రకటించారు. దీనితో కొమరం భీం, అల్లూరి పాత్రల్లో ఎన్టీఆర్,చరణ్ ఎలా ఉండబోతున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.
ఎన్టీఆర్ జోడిగా
ఈ చిత్రంలో ఎన్టీఆర్ జోడిగా శ్రద్దా కపూర్ని హీరోయిన్గా నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం ఎంట్రీ సన్నివేశాల కోసమే ఈ స్థాయిలో డబ్బు ఖర్చుచేస్తున్నారంటే ప్రధాన యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి ఊహించుకోవచ్చు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.