Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
త్రివిక్రమ్ ఎక్కువగా ఫోకస్ పెడుతోంది దానిపైనే.. అందుకే బన్నీ సినిమా ఆలస్యం!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్, రాధాకృష సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలనేది త్రివిక్రమ్ ప్లాన్ గా చెబుతున్నారు. అల్లు అర్జున్ ఈ చిత్రం కోసం తన లుక్ మార్చుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం బరువు తగ్గి మరింత స్టైలిష్ గా మారాలని త్రివిక్రమ్ బన్నీకి సూచించాడట. ఈ చిత్ర కథకు సంబందించిన తాజాగా ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.
హ్యాట్రిక్ మూవీ
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. వీరిద్దరో కాంబోలో ఇప్పటికే వచ్చిన రెండు చిత్రాలు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనితో ఈ హ్యాట్రిక్ మూవీపై ఇప్పటినుంచే మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రానికి ప్రకటన జరిగిన చాలా కాలం అవుతున్నా ఇంతవరకు షూటింగ్ ప్రారంభం కాలేదు.
ఆలస్యానికి కారణం
త్రివిక్రమ్ శ్రీనివాస్ కథపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రాల్లో ఆరంభంలో ఉన్నన్ని కామెడీ పంచులు ఉండడం లేదు. బన్నీ కోసం రూపొందించిన కథ కూడా ఫన్ ఎలిమెంట్స్ తో కూడుకున్నదిగా వార్తలు వస్తున్నాయి. దీనితో త్రివిక్రమ్ శ్రీనివాస్ వన్ లైన్ కామెడీ పంచులకు బాగా పదును పెడుతున్నారట. కథకు సంబంధించిన ఫినిషింగ్ టచ్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ నుంచి
తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్, అల్లు అర్జున్ చిత్రం ఏప్రిల్ నుంచి ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్వయంగా అల్లు అరవింద్ ఈ చిత్ర నిర్మాణంలో ఇన్వాల్వ్ కాబోతుండడం, త్రివిక్రమ్ సన్నిహితుడు రాధాకృష్ణ కూడా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండడంతో హ్యాట్రిక్ మూవీకి భారీ స్థాయిలోనే కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
బ్లాక్ బస్టర్ కొట్టాలని
అల్లు అర్జున్ చివరగా నటించిన నా పేరు సూర్య చిత్రం నిరాశ పరిచింది. దీనితో ఈ సారి ఎలాగైనా ఓ అద్భుత చిత్రం అందించిన ఫ్యాన్స్ ని సంతృప్తి పరచాలని అల్లు అర్జున్ భావిస్తున్నాడు. ఇక త్రివిక్రమ్ కూడా గత ఏడాది అరవింద సమేత లాంటి భారీ విజయంతో జోష్ మీద ఉన్నాడు. అల్లు అర్జున్ కు జోడిగా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.