Don't Miss!
- News షర్మిలపై జగన్ కామెంట్స్ ! చంద్రబాబు కౌంటర్-సజ్జల ఎన్ కౌంటర్..!
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాంచరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్.. దొంగ, పోలీస్ ఆటా..!
మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో దర్శకధీరుడు రాజమౌళి భారీ మల్టీస్టారర్ స్టారర్ చిత్రానికి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. రాజమౌళి ఈ చిత్ర కథని ఇద్దరు హీరోలకు ఇంకా వివరించాల్సి ఉంది. తాజాగా వస్తున్న ఈ వార్తలు ఈ చిత్రంపై ఆసక్తిని పెంచే విధంగా ఉన్నాయి.
తాజగా జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ చిత్రంలో రాంచరణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో, ఎన్టీఆర్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తారట. యాక్షన్ సన్నివేశాలు భారీ స్థాయిలో ఉంటాయి. నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రం కోసం 300 కోట్ల భారీ బడ్జెట్ పెట్టేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది.
రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ అరవింద సమేత చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాక రాజమౌళి చిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.