Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
న్యూయార్క్లో మొదలైన మహేష్ కొత్త సినిమా పనులు.. పక్కాగా ప్లానింగ్!
సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్నమొన్నటి వరకు భరత్ అనే నేను చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా గడిపాడు. భరత్ అనే నేను చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలియందే. ముఖ్యమంత్రిగా మహేష్ బాబు నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సూపర్ స్టార్ ఈ విజయాన్ని ఆస్వాదిస్తుంటే.. దర్శకుడు వంశి పైడి పల్లి మహేష్ కొత్త సినిమా పనులని ప్రారంభించేసాడు.
మహేష్ తో సినిమా కోసం ఈ దర్శకుడు రెండేళ్ల పాటు చూసిన సంగతి తెలిసిందే. భరత్ అనే నేను చిత్రం పూర్తి కావడంతో ఇప్పుడు వంశి పైడి పల్లి వంతు వచ్చింది. త్వరలో ఈ చిత్రం ప్రారంభించడానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. ఈ లోపు చిత్ర లొకేషన్స్ ని ఫైనల్ చేసే పనిలో వంశి పైడిపల్లి బిజీగా ఉన్నాడు.
కథ పరంగా ఈ చిత్రం విదేశాల్లో షూటింగ్ జరుపుకోనుంది. వంశి పైడిపల్లి, కెమెరామన్ మోహనన్ తో కలసి న్యూయార్క్ లో కీలకమైన లొకేషనల్స్ ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ విషయాన్ని వంశి సోషల్ మియాద ద్వారా వెల్లడించాడు. ఎవడు, ఊపిరి వంటి చిత్రాలతో వంశి ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.
Prepping up for #MB25 with my dearest K.U.Mohanan Sir... 'Getting to learn a lot professionally and personally from You Sir'.. 🙏... And this is how New York can look through His lense... :) pic.twitter.com/L1zF6bnl91
— Vamshi Paidipally (@directorvamshi) April 30, 2018