Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రేపటి నుంచే...
రెండేళ్లకొకసారి హైద్రాబాద్లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం రేపటి నుంచి ప్రారంభం కానుంది. రేపు 14 నుంచి 20వ తారీఖు వరకు వారం రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో 20 దేశాలనుంచి 70 సినిమాలు ప్రదర్శితమవుతాయి. ఈ వివరాలు వెల్లడించడానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫిలిం ఫెస్టివల్ చైర్ పర్సన్ నందితాదాస్, సిఈవో సుశోవన్ బెనర్జీ, రాష్ట్ర సమాచారశాఖ మంత్రి గీతారెడ్డి, చలనచిత్ర అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరక్టర్ సి.పార్థసారధి, యునిసెఫ్ ప్రతినిధి కరేన్ హుల్షుఫ్, జ్యూరీ మెంబర్ నగేష్ కుకునూర్ తదితరులు పాల్గొన్నారు. 14వ తేది సాయంత్రం ఆరన్నర గంలకు కేంద్ర సమాచారశాఖ మంత్రి అంబికాసోని చేతుల మీదుగా పబ్లిక్ గార్డెన్స్లోని లలిత కళాతోరణంలో 'ఫిలిం ఫెస్టివల్" ప్రారంభమవుతుందని, ముఖ్యమంత్రి కె.రోశయ్య ముఖ్య అతిధిగా పాల్గొంటారని చెప్పారు. వివిధ దేశాల నుంచి 400 మంది బాల ప్రతినిధులతోపాటు 100 మంది ప్రతినిధులు పాలుపంచుకుంటారని తెలిపారు.