Don't Miss!
- News రుణమాఫీపై రైతులకు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.2 లక్షలు
- Lifestyle Happy Birthday Wishes In Telugu : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Sports CSK Playing XI: స్టార్ ప్లేయర్పై వేటు.. LSGతో ఆడే తుదిజట్టు ఇదే
- Technology వన్ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
IPL 8: ప్రారంభ వేడుకల్లో పాల్గొనే హీరో,హీరోయిన్స్
హైదరాబాద్: క్రికెట్ అభిమానులను కనువిందు చేయడానికి ఏప్రిల్ 8న నుంచి ఐపీఎల్ సీజన్-8 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆరంభ వేడుకలకు బాలీవుడ్ తారాగణం హృతిక్ రోషన్, షాహిద్కపూర్, ఫర్హాన్ అక్తర్, అనుష్కశర్మ తదితరులు తమ ఆటపాటలతో అలరించనున్నారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ నెల 7న కోల్కతాలో ఈ ప్రారంభ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... సీజన్-8 ఆరంభ వేడుకలకు వ్యాఖ్యాతగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ వ్యవహరిస్తారని పేర్కొన్నారు.
అంతేకాకుండా అభిమానుల ఉత్సాహాన్ని పెంచే విభిన్న వినోద కార్యక్రమాలు చాలా ఉన్నాయని ఆయన అన్నారు. గత సీజన్ ఛాంపియన్స్ అయిన కోల్కత నైట్రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ తిరిగి ట్రోఫీని స్డేడియంలోకి తీసుకురానున్నారు.
ప్రపంచకప్ టోర్నీని ఆస్వాదించిన క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ రూపంలో మరో సరికొత్త క్రీడా సంగ్రామం స్వాగతం చెపుతోంది. ఏప్రిల్ 8న ప్రారంభమయ్యే ఐపీఎల్ మే 24న ముగుస్తుంది. మొత్తం 60 మ్యాచ్లతో ఆసాంతం కనుల విందు చేయడానికి మీ ముందుకు వస్తోంది.