Don't Miss!
- News అష్టదిగ్బంధనం - బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ముదిరిన ఎంసీఏ కోల్డ్వార్.. సాయి పల్లవికి దిల్ రాజు షాక్?.. ఆమె స్థానంలో..
ఫిదా చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకొన్న సాయి పల్లవికి నిర్మాత దిల్ రాజు షాకిచ్చినట్టు వార్తలు మీడియాలో వెలువడుతున్నాయి. ఫిదా తర్వాత దిల్ రాజు బ్యానర్లో ఎంసీఏ చిత్రంలో నాని సరసన నటించింది. అయితే ఎంసీఏ చిత్రమే దిల్ రాజు, సాయి పల్లవి మధ్య కోల్డ్వార్కు కారణమని ఓ ప్రముఖ టెలివిజన్ ఛానెల్ ఓ కథనాన్ని వెల్లడించడంతో ఆ విషయం చర్చానీయాంశమైంది.
Recommended Video
నాని, సాయి పల్లవి గొడవ
ఎంసీఏ చిత్ర షూటింగ్ సందర్భంగా హీరో నాని, హీరోయిన్ సాయి పల్లవి మధ్య గొడవ చోటుచేసుకొన్నదనే వార్త అప్పట్లో మీడియాలో నానింది. ఎంసీఏ సినిమా రిలీజ్ ముందు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మా మధ్య అలాంటి గొడవ జరుగలేదు అని నాని క్లారిటీ ఇచ్చారు.
తెరపైకి ఎంసీఏ కొత్త వివాదం
అయితే అంతటితో ఆ వివాదానికి శుభం కార్డు పడింది అని అందరూ అనుకొన్నారు. ఎంసీఏ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొత్త వివాదం బయటకు వచ్చింది. ఎంసీఏ చిత్ర రెండోభాగంలో తాను నటించిన సీన్లను కత్తిరించడంతో సాయి పల్లవి మనస్తాపానికి గురైందట.
సీన్లు తొలగించడంపై సాయిపల్లవి అలక
ఎంసీఏ నుంచి తొలగించిన సీన్లు య్యూటూబ్లో హల్చల్ చేస్తున్నాయి. సెకండాఫ్లో తన పాత్ర ప్రాధాన్యతను తగ్గించడం కారణంగానే చిత్ర ప్రమోషన్కు హాజరుకాలేదనే మరో వాదన.
దిల్రాజు మూడో సినిమాకు గుడ్బై
ఫిదా, ఎంసీఏ తర్వాత దిల్ రాజు బ్యానర్లో మూడో సినిమా చేయాల్సి ఉంది. కానీ ఏదో కారణం చూపుతూ ఆ చిత్రం నుంచి తప్పుకొన్నట్టు సమాచారం. దీంతో సాయపల్లవి స్థానంలో దువ్వాడ జగన్నాథంలో హాట్ హాట్గా నటించిన పూజా హెగ్డేను తీసుకొన్నట్టు తెలుస్తున్నది.
సాయి పల్లవి కోసం వెయిటింగ్
ఏదిఏమైనా ఫిదా, ఎంసీఏ చిత్రాల తర్వాత సాయి పల్లవి కెరీర్ జోరందుకున్నది. ఆమె డేట్ల కోసం కొందరు హీరోలు వెయిట్ చేస్తుండగా.. మరికొందరు తమ సినిమాలను సాయి పల్లవి డేట్స్కు అనుగుణంగా మార్చుకొంటున్నారు.
సాయి పల్లవి కోసం శర్వానంద్ ఫిదా
ఎంసీఏ తర్వాత సాయిపల్లవి ప్రస్తుతం శర్వానంద్ సరసన హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్నది. వాస్తవానికి సుధీర్ వర్మ సినిమా చేయాల్సిన శర్వానంద్.. సాయి పల్లవి కోసం ఆ సినిమాను పక్కన పెట్టి హను చిత్రాన్ని చేస్తున్నట్టు తెలిసింది.