Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ముదిరిన ఎంసీఏ కోల్డ్వార్.. సాయి పల్లవికి దిల్ రాజు షాక్?.. ఆమె స్థానంలో..
ఫిదా చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకొన్న సాయి పల్లవికి నిర్మాత దిల్ రాజు షాకిచ్చినట్టు వార్తలు మీడియాలో వెలువడుతున్నాయి. ఫిదా తర్వాత దిల్ రాజు బ్యానర్లో ఎంసీఏ చిత్రంలో నాని సరసన నటించింది. అయితే ఎంసీఏ చిత్రమే దిల్ రాజు, సాయి పల్లవి మధ్య కోల్డ్వార్కు కారణమని ఓ ప్రముఖ టెలివిజన్ ఛానెల్ ఓ కథనాన్ని వెల్లడించడంతో ఆ విషయం చర్చానీయాంశమైంది.
Recommended Video
నాని, సాయి పల్లవి గొడవ
ఎంసీఏ చిత్ర షూటింగ్ సందర్భంగా హీరో నాని, హీరోయిన్ సాయి పల్లవి మధ్య గొడవ చోటుచేసుకొన్నదనే వార్త అప్పట్లో మీడియాలో నానింది. ఎంసీఏ సినిమా రిలీజ్ ముందు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మా మధ్య అలాంటి గొడవ జరుగలేదు అని నాని క్లారిటీ ఇచ్చారు.
తెరపైకి ఎంసీఏ కొత్త వివాదం
అయితే అంతటితో ఆ వివాదానికి శుభం కార్డు పడింది అని అందరూ అనుకొన్నారు. ఎంసీఏ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొత్త వివాదం బయటకు వచ్చింది. ఎంసీఏ చిత్ర రెండోభాగంలో తాను నటించిన సీన్లను కత్తిరించడంతో సాయి పల్లవి మనస్తాపానికి గురైందట.
సీన్లు తొలగించడంపై సాయిపల్లవి అలక
ఎంసీఏ నుంచి తొలగించిన సీన్లు య్యూటూబ్లో హల్చల్ చేస్తున్నాయి. సెకండాఫ్లో తన పాత్ర ప్రాధాన్యతను తగ్గించడం కారణంగానే చిత్ర ప్రమోషన్కు హాజరుకాలేదనే మరో వాదన.
దిల్రాజు మూడో సినిమాకు గుడ్బై
ఫిదా, ఎంసీఏ తర్వాత దిల్ రాజు బ్యానర్లో మూడో సినిమా చేయాల్సి ఉంది. కానీ ఏదో కారణం చూపుతూ ఆ చిత్రం నుంచి తప్పుకొన్నట్టు సమాచారం. దీంతో సాయపల్లవి స్థానంలో దువ్వాడ జగన్నాథంలో హాట్ హాట్గా నటించిన పూజా హెగ్డేను తీసుకొన్నట్టు తెలుస్తున్నది.
సాయి పల్లవి కోసం వెయిటింగ్
ఏదిఏమైనా ఫిదా, ఎంసీఏ చిత్రాల తర్వాత సాయి పల్లవి కెరీర్ జోరందుకున్నది. ఆమె డేట్ల కోసం కొందరు హీరోలు వెయిట్ చేస్తుండగా.. మరికొందరు తమ సినిమాలను సాయి పల్లవి డేట్స్కు అనుగుణంగా మార్చుకొంటున్నారు.
సాయి పల్లవి కోసం శర్వానంద్ ఫిదా
ఎంసీఏ తర్వాత సాయిపల్లవి ప్రస్తుతం శర్వానంద్ సరసన హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్నది. వాస్తవానికి సుధీర్ వర్మ సినిమా చేయాల్సిన శర్వానంద్.. సాయి పల్లవి కోసం ఆ సినిమాను పక్కన పెట్టి హను చిత్రాన్ని చేస్తున్నట్టు తెలిసింది.