Don't Miss!
- News పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపు కష్టమే ... ప్రముఖ నిర్మాత షాకింగ్ కామెంట్స్
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Lifestyle పనీర్ బటర్ మాసాలాను ఇలా రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకోండి..!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
'వేదం' స్క్రీన్ ప్లే ఆ ప్లాప్ చిత్రంది ఒకటేనా?
క్రిష్ దర్శకత్వంలో రేపు రిలీజ్ కానున్న 'వేదం' చిత్రం, ప్రకాష్ దర్శకత్వంలో వచ్చి ప్లాపైన ఓం శాంతి రెండూ..ఒకే తరహా స్క్రీన్ ప్లే తో సాగుతాయని తెలుస్తోంది. చిత్రంలో ప్రధాన పాత్రలు ఒక దానితో ఒకటి సంభందం లేకుండా వేర్వేరు కథలతో ఉండి చివరలో అవి ఓ క్లైమాక్స్ లో కలుసుకుని వారి జీవన ఫంధాన్ని పునర్ నిర్వచించుకోవటమే కధాంశం అంటున్నారు. ఈ తరహా చిత్రాలు గతంలో హాలీవుడ్ లో వచ్చేవి. ఆస్కార్ విన్నింగ్ సినిమా క్రాష్ ఇదే తరహాలో ఉంటుంది. అలాగే ఆ మధ్య హిందీలో వచ్చిన ముంబయి మేరీ జాన్ చిత్రం, యహీ మేరీ ఇండియా లు కూడా ఇదే స్క్రీన్ ప్లేతో ఉండటం గమనార్హం. అదే ఓం శాంతి దగ్గరకు వస్తే ఈ చిత్రంలో ఐదు కథలు ఉంటాయి. ఆ కథలు..ఐదు జీవితాలను చెప్తాయి..వీటితో పాటు ఓ జీవిత సత్యం కూడా ఆవిష్కారమయ్యేలా కథ రాసుకున్నారు.
ఇక వేదం చిత్రంలో అల్లు అర్జున్, అనూష్క, మంచు మనోజ్,మనోజ్ బాజపయ్ లు ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. అల్లు అర్జున్ మాస్ క్యారెక్టర్ కేబుల్ రాజుగా చేస్తూండగా, మనోజ్..రాక్ స్టార్ గా కనిపిస్తాడు. అలాగే అనూష్క వేశ్య పాత్రలో కీలకంగా కనిపిస్తుంది. వీరివి ఎవరి కథలు వారివే. ఇవన్నీ చివరకు ముడిపడతాయి.క్రిష్ గత చిత్రం గమ్యం మంచి హిట్ అవటం అంతటా మంచి పేరు తేవటంతో మంచి అంచనాలే ఉన్నాయి. అయితే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఓం శాంతి తరహాలో ఉండటమే కాస్తంత ఇబ్బంది పెట్టే అంశం అంటున్నారు. ఏ విషయం రేపు రిలీజ్ అయ్యాక కానీ తెలియదు.