Don't Miss!
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
ఆ మాట రావద్దనే బాలయ్య కోసం జూ ఎన్టీఆర్...!
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా 'శ్రీమన్నారాయణ' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రవి చావలి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో బాలయ్య సరసన పార్వతి మెల్టన్, ఇషా చావ్లా నటిస్తున్నారు. ఈచిత్రం ఆడియో వేడుక ఆగస్టు 6న హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో జరుగబోతోంది.
ఈ వేడుకకు యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హాజరవుతారనే వార్తలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి. ఇటీవల రాజకీయంగా జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో బాబాయ్, అబ్బాయ్ మధ్య సంబంధాలు సరిగా లేవనే గాసిప్స్ గుప్పుమన్నాయి. అయితే ఈ విషయాన్ని ఇద్దరూ ఇప్పటికే ఖండించారు.
'శ్రీమన్నారాయణ' ఆడియో వేడుకకు హాజరవ్వడం ద్వారా ఆ వదంతులకు చెక్ పెట్టాలని, తమ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయనే నిరూపించడానికి జూ ఎన్టీఆర్ డిసైడ్ అయినట్లు సమాచారం. అయితే ప్రొడక్షన్ హౌస్ నుంచి మాత్రం ఈ విషయమై ఎలాంటి క్లారిటీ రాలేదు.
ప్రస్తుతం జూ ఎన్టీఆర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న తన తాజా సినిమా 'బాద్ షా' షూటింగు నిమిత్తం ఫ్రాన్స్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆడియో వేడుక కోసం జూనియర్ ఫ్రాన్స్ నుంచి ప్రత్యేకంగా వస్తారా? ఆలోపు అక్కడ షూటింగ్ కంప్లీట్ అవుతుందా? అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా...నందమూరి అభిమానులు మాత్రం ఈ ఇద్దరూ స్టార్స్ని ఒకే వేదికపై చూడాలని ఆశ పడుతున్నారు.