Don't Miss!
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Sports ఆ నిర్ణయమే మమ్మల్ని గెలిపించింది- పంత్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సవ్యసాచి కాపీ అంటూ వార్తలు.. తమిళ చిత్రంతో పోలిక!
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం సవ్యసాచి. రారండోయ్ వేడుక చిత్రం తరువాత చైతు సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవల విడుదలైన శైలజారెడ్డి అల్లుడు చిత్రం నిరాశపరిచింది. దీనితో చైతు ఆశలన్నీ సవ్యసాచిపై ఉన్నాయి. తనకు ప్రేమమ్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన చందూ ముండేటి దర్శత్వంలో చైతన్య సవ్యసాచి చిత్రం రూపొందింది. దీపావళి కానుకగా సవ్యసాచి చిత్రాన్ని నవంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా సవ్యసాచి చిత్రంపై కాపీ మరక పడింది.
విభిన్నమైన కథతో
సవ్యసాచి చిత్రాన్ని కథే ప్రధాన బలంగా రూపొందించినట్లు తెలుస్తోంది. కవల పిల్లలుగా పుట్టాల్సిన ఇద్దరు పిల్లలు తల్లి గర్భం నుంచి ఒకే వ్యక్తిగా జన్మిస్తే, ఆ వ్యక్తి ఎడమ చేయి తనలోపల ఉన్న రెండో వ్యక్తి అధీనంలో ఉంటె ఎలా ఉంటుంది అనే కథాంశంతో సవ్యసాచి చిత్రం తెరకెక్కుతోంది.
అదరగొడుతున్న ట్రైలర్
ఇటీవల సవ్యసాచి ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. మాట వినని ఎడమచేయితో నాగ చైతన్య ఇబ్బందులు ఎలా ఉంటాయి, కథ ఎలా మలుపు తిరిగింది అనే ఆసక్తి ఆడియన్స్ లో కలుగుతోంది. నాగ చైతన్య సరసన ఈ చిత్రంలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుండడం విశేషం.
కాపీ అంటూ విమర్శలు
సవ్యసాచి చిత్రం కాపీ చేసారు అంటూ తమిళ అభిమానులు, కోలీవుడ్ వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి. దానికి కారణం.. సవ్యసాచి చిత్రానికి దగ్గర పోలికలు ఉండే పీచాంకై అనే చిత్రం గత ఏడాది విడుదలయింది. ఈ చిత్రంలో ఆర్ఎస్ కార్తీక్ ప్రధాన పాత్రలో నటించాడు. అంజలి రావు హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో హీరో అలైన్ హ్యాండ్ సిండ్రోమ్ అనే వ్యాధితో భాధపడుతుంటారు.
ఎడమచేయి సమస్యే
పీచాంకై చిత్రంలో లాగే సవ్యసాచి చిత్రంలో కూడా నాగ చైతన్య తన ఎడమ చేయి వలన ఇబ్బందులు పడే పాత్రలో నటిస్తుండడమతొ కాపీ వార్తలు ఎక్కువవుతున్నాయి. ఈ వార్తలపై చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది. ప్రముఖ నటుడు మాధవన్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. భూమిక కీలక పాత్రలో నటిస్తోంది.