Don't Miss!
- News సీఎం పదవి ఊడిపోతుంది, మేము కొట్లాడుకుంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఈగనోడి !
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
ఆ సినిమా హక్కులు కొన్న నితిన్.. హీరోగా చేస్తాడా? నిర్మిస్తాడా?
చిన్న వయసులోనే భారీ విజయాలు సాధించాడు యంగ్ హీరో నితిన్. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు విజయాలను అందుకున్న నితిన్.. ఆ తర్వాత వరుస వైఫల్యాలను చవి చూశాడు. ఇక, ఇష్క్ తర్వాత అతడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభం అయింది. ఈ చిత్రం తర్వాత అతడు కొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, నితిన్ నటించిన చివరి రెండు మూడు సినిమాలు నిరాశనే మిగిల్చాయి. ఈ నేపథ్యంలో వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. తాజాగా అతడు మరో సినిమాను దక్కించుకున్నాడు.
అదే.. బాలీవుడ్లో గత ఏడాది విడుదలై పెద్ద విజయాన్ని సాధించిన 'అంధాధున్'. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టుబు ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో నటనకుగానూ ఆయుష్మాన్ ఖురానా జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నారు.
బాలీవుడ్లో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది. అది మొదలు ఈ మూవీ తెలుగు రైట్స్ కోసం చాలామంది నిర్మాతలు పోటీ పడ్డారు. అయితే ఈ రైట్స్ నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి చేజిక్కించుకున్నారు. మాతృక నిర్మాతైన వయాకామ్ 18 తెలుగులోనూ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనుందట. అయితే ఈ సినిమాలో నితిన్ నటిస్తాడా..? లేక నిర్మాతగా వ్యవహరిస్తాడా..? అన్నది మాత్రం తెలియడం లేదు. ప్రస్తుతం నితిన్ భీష్మ, రంగ్ దే చిత్రాల షూటింగ్తో బిజీగా ఉండడమే దీనికి కారణం.
'అంధాధున్'ను తమిళంలో కూడా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో విడుదలై తెలుగులోనూ ఘన విజయం సాధించిన 'జీన్స్', 'జోడి' చిత్రాల ఫేమ్ ప్రశాంత్ హీరోగా ఈ రీమేక్ రూపొందనుంది. ఇప్పటికే ఈ రీమేక్ హక్కులను ప్రశాంత్ తండ్రి, సీనియర్ నటుడు, దర్శకుడు త్యాగరాజన్ సొంతం చేసుకున్నారు.