Don't Miss!
- News మూడు శుభయోగాలతో ఉగాది ప్రారంభం; మూడు రాశులవారికి అదృష్టం!!
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్పై వేటు!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Finance IPO News: మార్కెట్లోకి రాకేష్ జున్జున్వాలా ఐపీవో.. డబ్బు రెడీ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు..
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
మరో ప్రముఖ సినీ హీరోకు క్యాన్సర్.. అమెరికాకు రణ్బీర్ కపూర్ తండ్రి!
బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ తండ్రి ప్రముఖ నటుడు రిషికపూర్ చికిత్స కోసం అమెరికాకు వెళ్లడం బాలీవుడ్లో చర్చనీయాంశమైంది. గత కొద్దిరోజులుగా రిషీ కపూర్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారనే వార్త మీడియాలో బలంగా వినిపిస్తున్నది. న్యూ ఇయర్ సందర్భంగా రిషి క్యాన్సర్తో బాధపడుతున్నట్టు ఆయన భార్య, నటి నీతూ కపూర్ చెప్పకనే చెప్పడం మరిన్నీ అనుమానాలకు బలం చేకూరింది. వివరాల్లోకి వెళితే..
రిషీ కపూర్ గురించి నీతూ కపూర్
నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా రిషి కపూర్, నీతూ కపూర్, రణ్బీర్ కపూర్, అలియాభట్తోపాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా కలుసుకొన్నారు. కేక్ కట్ చేసి ఆనందంగా సెలబ్రేట్ చేసుకొన్నట్టు స్పష్టమైంది. ఈ సందర్బంగా నర్మగర్భంగా నీతూ కపూర్ తన ఇన్స్టాగ్రామ్లో కామెంట్ పెట్టింది.
మీ చేతుల్లో సినీ తారల ప్రతిష్ఠ.. ఉత్తమ నటీనటులను, దర్శకులకు ఓటేయండి..
ఇన్స్టాగ్రామ్లో నీతూ కపూర్
హ్యాప్పీ న్యూఇయర్ 2019. ఈ ఏడాది ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోలేదు. కాలుష్యం, ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండాలని కోరుకొంటున్నాను. ఇక క్యాన్సర్ (కర్కాటకం) అనేది జాతక చిహ్నం (జొడియాక్ సైన్)గానే మిగిలిపోవాలి. పేదవారిని చిన్నచూపు చూడకుండా, సంపూర్ణమైన ఆరోగ్యంతో అందరూ సంతోషంగా ఉండాలి అని నీతూ పేర్కొన్నారు.
రిషీ కపూర్కు క్యాన్సర్ అని
రిషీ కపూర్ క్యాన్సర్తో బాధపడుతున్నారని, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నట్టు డైరెక్టుగా చెప్పకపోయినా నీతూ మాటలు పలు అనుమానాలకు బలం చేకూర్చాయి. అంతేకాకుండా అనారోగ్యానికి చికిత్స కోసం అమెరికా వెళ్తున్నట్టు ట్వీట్ చేయడంతో కొంత క్లారిటీ వచ్చేసింది.
తల్లి అంత్యక్రియలకు గైర్హాజరు
ఇటీవల మరణించిన తన తల్లి కృష్ణరాజ్ కపూర్ అంత్యక్రియలకు రిషీ కపూర్ హాజరుకాకపోవడంపై బాలీవుడ్లో పెద్ద చర్చ జరిగింది. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నందుకే ఆయన రాలేదని వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. కానీ ఆయన సోదరుడు రణ్ధీర్ కపూర్ వార్తలను ఖండించాడు.
ఇర్ఫాన్, సొనాలి బింద్రే బాటలో
ఇటీవల కాలంలో బాలీవుడ్ ప్రముఖులు ఎక్కువగానే క్యాన్సర్ వ్యాధికి గురయ్యారు. ఇర్ఫాన్ ఖాన్, సొనాలి బింద్రే, నఫీసా అలీ లాంటి వారు వ్యాధికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా రిషీకపూర్కు కూడా క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారనే వార్త అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నది.