Don't Miss!
- News ఏప్రిల్ 1న రూ.2000 నోట్ల డిపాజిట్, ఎక్స్ఛేంజ్ -ఆర్బీఐ కీలక ప్రకటన..!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
కావాలనే దేవీ శ్రీ ప్రసాద్ను పట్టించుకోలేదా.. తమన్ ట్వీట్పై అనుమానాలు
ఒకే వృత్తిలో ఉన్న వారికి ఎంతో కొంత పోటీ ఉండనే ఉంటుంది. పైగా సినీ ఇండస్ట్రీలో అది బాహాటంగానే కనిపిస్తుంది. ప్రస్తుతం తమన్, దేవీ శ్రీ ప్రసాద్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ అందరికీ తెలిసిందే. తమన్ తన సంగీతంతో తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ మాత్రం సైలెంట్గా ఉండిపోయాడు. పైగా చేతిలో ఏ ప్రాజెక్ట్ లేదని బయట కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆయన సరిలేరు చిత్రంతోనే నిరూపించుకోవాలని అది మిస్ అయితే దేవీ పని అయిపోయినట్టేనని టాక్ నడుస్తోంది.
కొత్త ట్యూన్స్తో ఊపేస్తున్న తమన్
ట్రెండీగా మారిన సామజవరగమనఅలవైకుంఠపురములో నుంచి విడుదలైన మొదటి సాంగ్.. సామజవరగమన. రిలీజైన కొద్ది క్షణాల్లోనే ఈ పాట వైరల్గా మారింది. తెలుగులో అత్యధిక మంది వీక్షించిన, లైకులు సాధించిన పాటగా రికార్డులకెక్కింది. ఇప్పటికీ ఈ సాంగ్ అప్రతిహతంగా దూసుకుపోతూనే ఉంది.
రాములో రాముల అంటూ సెన్సేషన్..
రెండో పాటగా విడుదలైన రాములో రాముల సాంగ్ మాస్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పార్టీలు, పబ్లు, డీజేలు ఇలా ఎక్కడ చూసినా రాములో రాముల అనాల్సిందే. ఈ పాటను అంతే అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ సిగ్నేచర్ స్టెప్పులు వైరల్ అయ్యాయి.
మూడో పాట కూడా వైరల్..
అలవైకుంఠపురములో నుంచి విడుదలైన మూడో పాటను కూడా ట్రెండీగా ఉండటంతో ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం తమన్ జపం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎక్కడ ఏ పాట విడుదలైనా తమన్ పేరే కనిపిస్తోంది. ఆయన పాటే వినిపిస్తోంది. ప్రతి రోజూ పండగే, డిస్కో రాజా ఇలా విడుదలైన ప్రతీ పాట తమన్ మార్క్ను చూపిస్తోంది. ప్రస్తుతం తెలుగులో తమన్ దూసుకుపోతున్నాడు.
సైలెంట్ అయిన దేవీ..
ఆ మధ్య సరిలేరు టైటిల్ సాంగ్తో కొన్ని విమర్శలు మూట గట్టుకున్న దేవీ.. ఆపై మళ్లీ మరో పాటను రిలీజ్ చేయలేదు. తమన్ మాత్రం ఇలా పాట మీద పాట రిలీజ్ చేసుకుంటూ పోతూ సోషల్ మీడియాలో కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుండగా.. దేవీ మాత్రం మౌనంగా ఉండిపోయాడు.
|
సరిలేరు టీజర్తో దుమ్ములేపాడు..
సరిలేరు టీజర్లో అందరూ డైలాగ్స్తో రెచ్చిపోగా.. వారందరి ఎమోషన్ను తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్తో ఎలివేట్ చేశాడు. సోషల్ మీడియాలో దేవీ అందించిన నేపథ్య సంగీతానికి ప్రశంసలు లభిస్తుండగా.. తమన్ మాత్రం పూచిక పుల్లను తీసి పారేసినట్టుగా కనిపిస్తోంది.
అందర్నీ ప్రశంసించి.. దేవీని విస్మరించాడు..
ఈ టీజర్ను ప్రశంసిస్తూ.. మహేష్ బాబు, అనిల్ రావిపూడి, దిల్ రాజులను ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు తమన్. కానీ తన వృత్తిలో భాగమైన సంగీతం నేపథ్య సంగీతం గురించి కామెంట్ చేయలేదు.. దేవీని ప్రశంసించలేదు. తమన్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.