twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'గౌతమ్' రీ-ఎంట్రీ

    By Staff
    |

    ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్. సుచిత్రా చంద్రబోస్ దర్శకత్వంలో వచ్చిన 'పల్లకిలో పెళ్లికూతురు' చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమైన గౌతమ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచయమే. ఆ సినిమా ఆశించినంత విజయం సాధించకపోవడంతో తెరమరుగయిపోయారు. కానీ సినిమాలకు మాత్రం దూరం కాలేదు. ఇన్నాళ్లు నటనకు సంభందించిన శిక్షన తీసుకున్న గౌతమ్ త్వరలోనే రీ-ఎంట్రీకి సిద్ధమవుతున్నాడట.

    'ఐతే', 'అనుకోకుండా ఒక రోజు', 'ఒక్కడున్నాడు', 'ప్రయాణం' లాంటి వైవిధ్యమైన చిత్రాలను అందించిన చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నటించబోతున్నాడని సమాచారం. ఇప్పటికే కథాచర్చలు పూర్తయిన ఈ చిత్రం త్వరలోనే లాంఛనంగా ప్రారంభంకానుంది. ప్రస్తుతం కథానాయిక కోసం అన్వేషన జరుగుతోంది. ఈ రీ-ఎంట్రీతో తన కెరీర్ ఊపందుకుంటుందని గౌతమ్ ఆశిస్తున్నాడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X