Don't Miss!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- News కాంగ్రెస్ వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికి? కుమార్తెతో సహా కడియం శ్రీహరి జంప్తో చర్చ!!
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఇస్రోకు థాంక్స్ చెప్పిన హీరో ప్రభాస్... చంద్రయాన్ 2కు, బాహుబలికి లింకు ఏంటి?
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చంద్రుడిపై పరిశోధనల కోసం పంపిన చంద్రయాన్ 2 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం అయింది. 3.84లక్షల కి.మీల దూరం ప్రయాణించనున్న ఈ ఉపగ్రహం సెప్టెంబర్ 7న చంద్రుడిపై వాలనుంది. ఇస్రో పంపిన జీఎస్ఎల్వీ-మార్క్3ఎం1 వాహకనౌక(రాకెట్)కు బాహుబలి అని పిలుస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభాస్ తన ఫేస్ బుక్ పేజీ ద్వారా స్పందించారు. హలో డార్లింగ్స్.. ఇది మన భారతీయులు గర్వపడే రోజు. ఇస్రో చంద్రయాన్ 2ను విజయవంతంగా నింగిలోకి పంపింది. చంద్రయాన్ 2ను పంపిన రాకెట్ను బాహుబలి అని పిలుస్తుండటంపై మా చిత్ర బృందం ఎంతో సంతోషంగా ఉంది, ఇది మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. ఈ ప్రయోగం వెనక ఎన్నో సంవత్సరాల శ్రమ దాగి ఉంది, ఇది మన దేశానికి మరింత పవర్ ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ప్రభాస్ వ్యాఖ్యానించారు.
చంద్రయాన్ 2 ఉపగ్రహంలో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ అనే మూడు పరికరాలు ఉంటాయి. వీటి మొత్తం బరువు 3447 కిలోలు. ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ తిరుగుతూ సమాచారాన్ని సేకరిస్తే... ల్యాండర్ ద్వారా రోవర్ చంద్రుడిపై దిగా అక్కడ నీటి ఆనవాళ్లపై పరిశోధన చేస్తుంది.
ప్రభాస్ సినిమాల విషయానికొస్తే... ఇండియా మొత్తం 2019లో ఎదురు చూస్తున్న అతిపెద్ద మూవీ 'సాహో'. బాహుబలి లాంటి భారీ ప్రాజెక్ట్ తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఈ మూవీపై అంచనాలో ఓ రేంజిలో ఉన్నాయి. అందుకు తగిన విధంగానే రూ. 300 కోట్ల బడ్జెట్తో యూవి క్రియేషన్స్ వారు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ బిగ్ మూవీని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని అనుకోని కారణాల రిలీజ్ డేట్ ఆగస్టు 30కి వాయిదా వేశారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదని భావించామని, పోస్ట్ ప్రొడక్షన్ మరింత క్వాలిటీగా రావాలనే ఉద్దేశ్యంతో రిలీజ్ డేట్ వాయిదా వేసినట్లు తెలిపారు.