Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఈ చిత్రం మగధీరని అధిగమిస్తుంది...రాజమౌళి
మగధీర రికార్డుని ఇలాంటి..అలాంటి సినిమాలేవీ కొట్టేలేవని 'దూకుడు"తో తేలిపోయింది. మొదట్లో ఓ ఊపు ఊపినా కానీ తర్వాత చల్లబడిపోయిన దూకుడు కనీసం మగధీర ఛాయలకి కూడా వెళ్లలేకపోయింది. మళ్లీ ఎవరైనా పెద్ద హీరోతో అటెంప్ట్ చేస్తే మగధీరని తలదన్నే స్థాయిలో సినిమా ఉండాలని భావించిన రాజమౌళి మధ్యలో తన శైలికి భిన్నంగా మర్యాద రామన్న, ఈగ చిత్రాలు చేశాడు.
తర్వాత చేయబోయే ప్రభాస్ సినిమా మాత్రం తప్పకుండా మగధీరని మించేలా ఉంటుందని రాజమౌళి అంటున్నారు. మగధీర కంటే ఎక్కుక బడ్జెట్ తో రూపొందే ఈ చిత్రం చారిత్రిక నేపథ్యంలో ఉంటుందని టాక్. కే.రాఘవేంద్రరావు సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. వచ్చే ఏప్రియల్లో ఈ చిత్రం ప్రారంభం అవుతుంది.
రాజమౌళితో ప్రభాస్ గతంలో ఛత్రపతి సినిమా చేసిన విషయం తెలిసిందే. ప్రభాస్ కెరీర్ లో వర్షం, చత్రపతి, చిత్రాలను బిగ్గెస్ట్ హిట్స్ గా చెప్పుకోవచ్చు. డార్లింగ్, తర్వాత ఈ మధ్య కాలంలో ప్రభాస్ కి అటువంటి హిట్ దొరకలేదు. బిల్లా మాత్రం కమర్షియల్ గా పర్వాలేదనిపింకుంది. ఈ నేపథ్యంలో 'ఛత్రపతి" దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళీ యమదొంగ, మగధీర లాంటి హిట్ చిత్రాల తర్వాత మళ్లీ రెబల్ స్టార్ ప్రభాస్ తోనే ఓ సెన్సేషన్ చిత్రాన్ని తెరకెక్కించాలని పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. మగధీర ఛాలా పెద్ద హిట్ అయింది. కనుక దానికంటే బెటర్ ప్రాజెక్ట్ అయితే చేస్తాడని రాజమౌళిపై అంచనాలు భారీగా పెట్టుకొంటున్నారు అభిమానులు.