twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ చిత్రం మగధీరని అధిగమిస్తుంది...రాజమౌళి

    By Sindhu
    |

    మగధీర రికార్డుని ఇలాంటి..అలాంటి సినిమాలేవీ కొట్టేలేవని 'దూకుడు"తో తేలిపోయింది. మొదట్లో ఓ ఊపు ఊపినా కానీ తర్వాత చల్లబడిపోయిన దూకుడు కనీసం మగధీర ఛాయలకి కూడా వెళ్లలేకపోయింది. మళ్లీ ఎవరైనా పెద్ద హీరోతో అటెంప్ట్ చేస్తే మగధీరని తలదన్నే స్థాయిలో సినిమా ఉండాలని భావించిన రాజమౌళి మధ్యలో తన శైలికి భిన్నంగా మర్యాద రామన్న, ఈగ చిత్రాలు చేశాడు.

    తర్వాత చేయబోయే ప్రభాస్ సినిమా మాత్రం తప్పకుండా మగధీరని మించేలా ఉంటుందని రాజమౌళి అంటున్నారు. మగధీర కంటే ఎక్కుక బడ్జెట్ తో రూపొందే ఈ చిత్రం చారిత్రిక నేపథ్యంలో ఉంటుందని టాక్. కే.రాఘవేంద్రరావు సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. వచ్చే ఏప్రియల్‌లో ఈ చిత్రం ప్రారంభం అవుతుంది.

    రాజమౌళితో ప్రభాస్ గతంలో ఛత్రపతి సినిమా చేసిన విషయం తెలిసిందే. ప్రభాస్ కెరీర్ లో వర్షం, చత్రపతి, చిత్రాలను బిగ్గెస్ట్ హిట్స్ గా చెప్పుకోవచ్చు. డార్లింగ్, తర్వాత ఈ మధ్య కాలంలో ప్రభాస్ కి అటువంటి హిట్ దొరకలేదు. బిల్లా మాత్రం కమర్షియల్ గా పర్వాలేదనిపింకుంది. ఈ నేపథ్యంలో 'ఛత్రపతి" దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళీ యమదొంగ, మగధీర లాంటి హిట్ చిత్రాల తర్వాత మళ్లీ రెబల్ స్టార్ ప్రభాస్ తోనే ఓ సెన్సేషన్ చిత్రాన్ని తెరకెక్కించాలని పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. మగధీర ఛాలా పెద్ద హిట్ అయింది. కనుక దానికంటే బెటర్ ప్రాజెక్ట్ అయితే చేస్తాడని రాజమౌళిపై అంచనాలు భారీగా పెట్టుకొంటున్నారు అభిమానులు.

    English summary
    SS Rajamouli and Prabhas combinational movie was announced recently. The director, who is known for big budget movies, has said that the movie will be bigger than his blockbuster Magadheera.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X