Don't Miss!
- News ఏపీలో కూటమికి వచ్చే సీట్లు ఇవే- రఘురామ తాజా అంచనా..!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
ఈ చిత్రం మగధీరని అధిగమిస్తుంది...రాజమౌళి
మగధీర రికార్డుని ఇలాంటి..అలాంటి సినిమాలేవీ కొట్టేలేవని 'దూకుడు"తో తేలిపోయింది. మొదట్లో ఓ ఊపు ఊపినా కానీ తర్వాత చల్లబడిపోయిన దూకుడు కనీసం మగధీర ఛాయలకి కూడా వెళ్లలేకపోయింది. మళ్లీ ఎవరైనా పెద్ద హీరోతో అటెంప్ట్ చేస్తే మగధీరని తలదన్నే స్థాయిలో సినిమా ఉండాలని భావించిన రాజమౌళి మధ్యలో తన శైలికి భిన్నంగా మర్యాద రామన్న, ఈగ చిత్రాలు చేశాడు.
తర్వాత చేయబోయే ప్రభాస్ సినిమా మాత్రం తప్పకుండా మగధీరని మించేలా ఉంటుందని రాజమౌళి అంటున్నారు. మగధీర కంటే ఎక్కుక బడ్జెట్ తో రూపొందే ఈ చిత్రం చారిత్రిక నేపథ్యంలో ఉంటుందని టాక్. కే.రాఘవేంద్రరావు సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. వచ్చే ఏప్రియల్లో ఈ చిత్రం ప్రారంభం అవుతుంది.
రాజమౌళితో ప్రభాస్ గతంలో ఛత్రపతి సినిమా చేసిన విషయం తెలిసిందే. ప్రభాస్ కెరీర్ లో వర్షం, చత్రపతి, చిత్రాలను బిగ్గెస్ట్ హిట్స్ గా చెప్పుకోవచ్చు. డార్లింగ్, తర్వాత ఈ మధ్య కాలంలో ప్రభాస్ కి అటువంటి హిట్ దొరకలేదు. బిల్లా మాత్రం కమర్షియల్ గా పర్వాలేదనిపింకుంది. ఈ నేపథ్యంలో 'ఛత్రపతి" దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళీ యమదొంగ, మగధీర లాంటి హిట్ చిత్రాల తర్వాత మళ్లీ రెబల్ స్టార్ ప్రభాస్ తోనే ఓ సెన్సేషన్ చిత్రాన్ని తెరకెక్కించాలని పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. మగధీర ఛాలా పెద్ద హిట్ అయింది. కనుక దానికంటే బెటర్ ప్రాజెక్ట్ అయితే చేస్తాడని రాజమౌళిపై అంచనాలు భారీగా పెట్టుకొంటున్నారు అభిమానులు.