Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
విచారణకు హాజరు కావాల్సిందే.. రష్మికకు నోటీసులు
సరిలేరు నీకెవ్వరు చిత్రంలో అర్థమవుతుందా? ఐ యామ్ ఇంప్రెస్డ్ అంటూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో అదరగొట్టింది రష్మిక మందాన్న. గ్లామర్తో పాటు చిలిపిగా కనిపించి, కవ్వించిన రష్మికపై సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైలర్ అవుతున్నాయి. ఆమె ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారని, ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని, రెమ్యూనరేషన్ పెంచేసిందిని ఇలా పలు రకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఓ సారి వాటి వివరాలేంటో చూద్దాం.
రష్మిక నివాసంలో..
కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్పేటలో ఉన్న రష్మిక మందన్న సొంత ఇంట్లో ఐటీ అధికారులు గురువారం (జనవరి 16) సోదాలు జరిపారు. తనిఖీ చేస్తున్న ఐటీ శాఖ ఉద్యోగులు ఆమె ఆదాయానికి సంబంధించి లెక్కలను పరిశీలించారని, ఆదాయం పెరగడం, ట్యాక్స్ కట్టడం లేదనే ఆరోపణలు రావడంతో ఈ దాడులు జరిపినట్టు వార్తలు వచ్చాయి.
రూ.25లక్షలు స్వాధీనం..
ఆమె ఇంటికి సంబంధించి ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు రష్మిక తల్లిదండ్రులు సరిగా సమాధానం చెప్పలేకపోవడంతో అధికారులు ఇంటి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. అలాగే రష్మిక తల్లిదండ్రుల నుంచి ఆమె బ్యాంక్ ఖాతా వివరాలు, ఆస్తి వివరాలకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించారని, లెక్కలోకి రాని రూ. 25 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది.
తాజాగా నోటీసులు..
ఐటీ దాడులకు సంబంధించి ఈ నెల 21న (మంగళవారం) బెంగళూరులోని ఐటీ కార్యాయంలో విచారణకు హాజరు కావాలని రష్మికతో పాటు ఆమె తండ్రి మదన్, తల్లి సుమన్కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిందని తెలుస్తోంది. తాము ఎలాంటి తప్పు చేయలేదని ఆమె తండ్రి మదన్ తెలిపారు. ఆస్తులన్నీ చట్టబద్ధమైనవేనని, ఐటీ విచారణకు హాజరు అవుతామని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది.
రష్మిక క్లారిటీ..
తాను ఐటీశాఖకు కట్టాల్సిన పన్నులు క్రమం తప్పకుండా కడుతున్నానని.. తాజాగా జరిగిన ఐటీ సోదాలు తన తండ్రి చేసే వ్యాపారానికి సంబంధించినవే తప్పించి.. తనకు సంబంధం లేదని రష్మిక చెప్పుకొస్తుందట. అంతేకాదు.. తన ఐటీ లెక్కలన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయని అందట. రెమ్యూనరేషన్ పెంచానని వార్తలు వస్తున్నాయని, వాటిల్లో కూడా ఎలాంటి నిజం లేదని తెలిపింది.