Don't Miss!
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Lifestyle తీర్చుకోలేని రుణం అమ్మ ప్రేమ..! మన పుట్టినరోజున అందరికంటే ఎక్కువ సంతోషపడేది అమ్మ..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రష్మిక ఇంటిపై ఐటీ రైడ్స్.. ఎంత స్వాధీనం చేసుకున్నారంటే..?
'ఛలో' సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక.. 'గీతగోవిందం' సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత భారీ రెమ్మ్యూనరేషన్ అందుకుంటూ స్టార్ హీరోల సరసన అవకాశాలు పట్టేస్తోంది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్గా మారింది. ప్రస్తుతం రష్మిక సరిలేరు నీకెవ్వరు చిత్ర విజయాన్ని ఆస్వాధిస్తోంది. అయితే ఈ సమయంలో ఆమె ఇంటిపై ఐటీ అధికారులు రైడ్ చేయడం కలకలం రేపుతోంది.
సెలెబ్రిటీలపై ఐటీ కన్ను..
ఈ మధ్యకాలంలో సినీ నటుల ఐటీ అధికారులు కన్నేశారు. వరుసగా సినీ ప్రముఖుల మీద దాడులు జరుగుతుండటం చూస్తూనే ఉన్నాం. మొన్నామధ్య నాగార్జున, నాని, వెంకటేష్ లాంటి బడా హీరోల ఇళ్లపై ఐటీ దాడులు చేసిన ఆఫీసర్స్.. ఇటీవలే లావణ్య త్రిపాఠి, అనసూయ, సుమ ఇళ్లపై కూడా ఐటీ రైడ్స్ చేశారు. అయితే అనసూయ, రష్మీలు ఆ వార్తలను ఖండించారనుకోండి అది వేరే విషయం. ఇప్పుడు క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న ఇంటిపై ఐటీ ఆఫీసర్స్ దాడులు చేయడం హాట్ టాపిక్ అయింది.
Recommended Video
వరుస హిట్లు.. భారీ రెమ్యూనరేషన్..
తెలుగులో అతి తక్కవ కాలంలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న ఈ కన్నడ భామకు స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చేసింది. అందుకే సూపర్ స్టార్, స్టైలీష్ స్టార్ వంటి చిత్రాల్లో ఆఫర్లను దక్కించుకుంది. రష్మిక భారీ రెమ్మ్యూనరేషన్ అందుకుంటూ టాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారింది.
ఇంటిపై ఐటీ దాడులు..
ఇదిలా ఉంటే కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్పేటలో ఉన్న రష్మిక మందన్న సొంత ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. తనిఖీ చేస్తున్న ఐటీ శాఖ ఉద్యోగులు ఆమె ఆదాయానికి సంబంధించి లెక్కలను పరిశీలించారు. గురువారం (జనవరి 16) ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి ఈ సోదాలు జరిగాయి. ఆదాయం పెరగడం, ట్యాక్స్ కట్టడం లేదనే ఆరోపణలు రావడంతో ఈ దాడులు జరిపినట్టు తెలుస్తోంది.
సరైన సమాధానాలు చెప్పలేక..
గురువారం ఐటీ అధికారులు బెంగళూరు నుంచి విరాజ్పేటకు చేరుకోగా.. ఆ సమయంలో రష్మిక షూటింగ్లో బిజీగా ఉండటంతో ఆమె తల్లిదండ్రులను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఆమె ఇంటికి సంబంధించి ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు రష్మిక తల్లిదండ్రులు సరిగా సమాధానం చెప్పలేకపోవడంతో అధికారులు ఇంటి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అలాగే రష్మిక తల్లిదండ్రుల నుంచి రష్మిక బ్యాంక్ ఖాతా వివరాలు, ఆస్తి వివరాలకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించారని, లెక్కలోకి రాని రూ. 25 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.