Don't Miss!
- News నామినేషన్ల పర్వంలో టీడీపీకి ఊహించని షాక్
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘మహర్షి’ షూట్ ఫినిష్: సంబరాల్లో మహేష్, సితార, నమ్రత, చిత్ర బృందం!(ఫోటోలు)
మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'మహర్షి' షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సెట్స్లో సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకలో మహేష్ బాబు, వంశీ పైడిపల్లి భార్య, పిల్లలు కూడా పాల్గొనడం విశేషం.
గుమ్మడికాయ కొట్టిన అనంతరం మహేష్ కూతురు సితార, వంశీ కూతురు ఆద్య కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ ప్రారంభించారు. నిర్మాత దిల్ రాజు ఈ సందర్భంగా అందరికీ విందు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మహర్షి
మహేష్ బాబు కెరీర్లో ‘మహర్షి' 25వ చిత్రం. సూపర్ స్టార్ కెరీర్లో ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు వంశీ పైడిపల్లి. ఇప్పటి వరకు తెలుగులో రాని యూనిక్ స్టోరీని టాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నాడు.
అభిమానులు, కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా
అభిమానులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు కుటుంబ ప్రేక్షకులు కోరుకునే వినోదాత్మక అంశాల మేళింపుతో ఈ చిత్రం ఉండబోతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది.
భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘మహర్షి' మూవీ థియేట్రికల్ రైట్స్ రూ. 94.50 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దీంతో పాటు శాటిలైట్, డబ్బింగ్, ఇతర డిజిటల్ రైట్స్ అన్నీ కలిపి నిర్మాతలు రూ. 141 కోట్ల బిజినెస్ జరిగింది.
ఆసక్తి రేపుతున్న ముఖ్య పాత్రలు
ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇంకా మీనాక్షి దీక్షిత్, రాజేంద్రప్రసాద్, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ముఖేష్ రిషి, నాజర్, ప్రకాష్ రాజ్, నరేష్, జయసుధ, పోసాని, రావురమేష్, బ్రహ్మాజీ, పృథ్వి ఇలా భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
మే 9న గ్రాండ్ రిలీజ్
‘మహర్షి' చిత్రాన్ని మే 9న గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ఇటు ప్రమోషన్స్ సమాంతరంగా జరుగబోతున్నాయి. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి లాంటి బడా నిర్మాతలు సినిమాలో ఇన్వాల్వ్ కావడంతో మహేష్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.