Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నాగబాబు బిక్షం వేస్తేనే నువ్వు అప్పుడు గెలిచావ్: శివాజీ రాజాపై హైపర్ ఆది ఫైర్!
Recommended Video
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మెగాబ్రదర్ నాగబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి, పవన్ కళ్యాణ్ చాలా మంచి వ్యక్తులని, నాగబాబు మంచి వాడు కాదని, అతడికి నరసాపురం నియోజకవర్గ ప్రజలు ఓటు వేయవద్దంటూ శివాజీ రాజా ప్రచారం చేస్తున్నారు. అంతే కాదు నాగబాబు వెన్నుపోటు దారుడు, పిల్లికి బిక్షం కూడా వేయడు.. అలాంటి వ్యక్తి ప్రజలకు సేవ చేస్తాడనే నమ్మకం పెట్టుకోవద్దు అంటూ శివాజీ రాజా తీవ్ర పదజాలంతో నాగబాబును టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది నాగబాబుకు మద్దతుగా శివాజీ రాజాకు కౌంటర్ ఇచ్చారు.
అలా చేస్తే చిరంజీవికి, పవన్ కళ్యాణ్కి నచ్చుతుందా?
‘‘శివాజీ రాజా గారూ ఒక సీనియర్ ఆర్టిస్టుగా మీరంటే నాకు ఎంతో గౌరవం. కానీ మీరు నాగబాబు గురించి మాట్లాడినదాంట్లో ఒక్కటి కూడా నిజం లేదు. మీరు ఆ మాటలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి. చిరంజీవిగారంటే చాలా ఇష్టమని అంటున్న మీరు... నాగబాబు గారిని తిడితే చిరంజీవిగారికి నచ్చుతుందా? ఒక్కసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారంటే నాకు ప్రాణమని చెబుతున్నారు.. ఆయన ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టిన నాగబాబు గారికి ఓటు వేయవద్దు అని మీరు చెబితే పవన్ కళ్యాణ్ గారికి నచ్చుతుందా?'' అని హైపర్ ఆది ప్రశ్నించారు.
ఆయన బిక్షం వేస్తేనే నువ్వు గెలిచావ్
‘‘పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవిగారిని పొగిడి నాగబాబు గారిని తిడితే మా లాంటి మెగా అభిమానులకు నచ్చుతుందా? ఈ విషయాలన్నీ శివాజీ రాజా ఆలోచించాలి.. ఒక పెద్ద వ్యక్తిగా, సీనియర్ ఆర్టిస్టుగా ఈ మాత్రం ఆలోచించలేని వ్యక్తి మీరు అనుకోవడం లేదు. మీరు ఇంకో మాట అన్నారు... నాగబాబు పిల్లికి బిక్షం వేయడు అని, నువ్వు రెండు సంవత్సరాలు మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంటుగా చేశావు. అది నువ్వు ఎవరి బిక్షం వేస్తే చేశావ్. ఆయన బిక్షం వేస్తేనే చేశావు.'' అని ఆది ఫైర్ అయ్యారు.
నాగబాబు ఎంతో మందికి సహాయం చేశారు
‘‘జబర్దస్త్లో ఒక ఆర్టిస్టుకి కిడ్నీ ఫెయిల్ అయితే నాగబాబు గారు రూ. 10 లక్షల సాయం చేశారు. మీకు ఏం తెలుసని అంత మాట అంటారు? ఎంత మందికి ఎన్ని సహాయాలు చేశారో నాగబాబు గురించి మీకు తెలుసా? సినిమా ఇండస్ట్రీ కానీ, బయటి వారు కానీ నాగబాబు గురించి ఒకే మాట చెబుతారు. మంచి మనసున్న కల్మషం లేని మనిషి అని.. అది తెలిసి కూడా మీరు ‘మా' ఎన్నికల్లో ఓడిపోయారనే అక్కసుతో ఇలా మాట్లాడుతున్నారు.'' అని ఆది చెప్పుకొచ్చారు.
వెన్ను పోటు అంటే మీదే...
‘‘నాగబాబు గారు మీకు వెన్నుపోటు పొడిచారా? ‘మా'లో కొత్త మార్పు కావాలని కొత్త ప్యానల్ కు సపోర్ట్ చేశారు. అలా అనుకోవడం తప్పా? మీకు సపోర్టు చేయలేదంటే దాన్ని వెన్ను పోటు అనడం కరెక్టా? అసలు వెన్నుపోటు అంటే మీకు మీనింగ్ తెలుసా? మీరు ఓడిపోయారనే అక్కసుతో అంతకు ముందు మిమ్మల్ని గెలిపించారన్న విషయాన్ని కూడా మరిచిపోయి మీరు మాట్లుడుతున్నారే.. అదీ వెన్నుపోటు.'' అంటూ శివాజీ రాజాను ఏకిపారేశారు.
నోరు అదుపులో పెట్టుకోండి
‘‘నాది నరసాపురం, నాగబాబు అలా మాట్లాడితే ఊరు నుంచి తిరిమి తరిమి కొడతారు అని మరో మాట అన్నారు. ఒక్కసారి నరసాపురం సెంటర్లోకి వచ్చి మీరు, నాగబాబు నిలబడండి... ఎవరిని తరిమి కొడతారో అది కూడా చూద్దాం. శివాజీ రాజా గారూ మాట అదుపులో పెట్టుకోండి. మీకు అంతకు ముందు ఎన్ని సంవత్సరాల నుంచి నాగబాబు గారితో అనుబంధం ఉందో, ఫ్రెండ్షిప్ ఉందో మాకు తెలియదు. మేము 5 సంవత్సరాల నుంచి దగ్గర నుంచి చూశాం. ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి మాకు తెలుసు. ఆయన కల్మషం లేని మనస్తత్వం గురించి మాకు తెలుసు. మీరు మాట్లాడేపుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి.'' అంటూ ఆది హెచ్చరించారు.
బిస్కెట్లు వేయడం ఆపు
‘‘నాగబాబుగారి నడక గురించి కూడా ఓ మాట అన్నారు. ఆయన కిచెన్లో నుంచి బయటకు రావడానికి అరగంట పడుతుంది, కారెక్కడానికి అరగంట పడుతుంది.. ఇక ప్రజా సమస్యలు ఏం తీరుస్తారు అని.. ఇవన్నీ అనే ముందు మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీరంటే ఎవరికీ నచ్చకే మిమ్మల్ని ఎవరూ గెలిపించలేదు. ఆ విషయం గుర్తు పెట్టుకోండి. ఏది పడితే అది నోటికొచ్చినట్లు మాట్లాడకండి. మెగా ఫ్యామిలీలో నాకు చిరంజీవి ఇష్టం, పవన్ కళ్యణ్ అంటే ఇష్టం అంటూ బిస్కెట్లు వేసి నాగబాబు గారిని తిట్టాల్సిన అవసరం లేదు. మీరు ఓడి పోయారనే అక్కసుతో మాట్లాడుతున్నారు అనేది జనాలకు తెలుసు.'' అని ఆది వ్యాఖ్యానించారు.