Don't Miss!
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- News పవన్కు బిగ్ షాక్..వైసీపీలోకి జనసేన కీలక నేత
- Finance HUL News: ఆ వ్యాపారం నుంచి తప్పుకుంటున్న హిందుస్థాన్ యూనీలివర్.. 20 ఏళ్ల తర్వాత..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
మీరు తీహార్ జైల్లో ఉండాలి: వరుణ్ తేజ్పై జబర్దస్త్ ఆర్బీ పంచ్ అదిరిపోయిందిగా..!
జబర్దస్త్ కామెడీ షోలోకి హీరోలు, హీరోయిన్లు తమ సినిమాల ప్రమోషన్ కోసం వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వాల్మీకి చిత్ర ప్రమోషన్ కోసం ఆ సినిమా కథానాయకుడు వరుణ్ తేజ్, కథానాయిక మృణాళిని వచ్చారు. ఇక వారిపై జబర్దస్త్ కిట్స్ చేసే కమెడియన్లు వారిపై జోకులు, బిస్కెట్లు వేస్తూ నవ్వులు పూయించారు.
వాల్మీకి ప్రమోషన్ కోసం..
వాల్మీకి చిత్రం విడుదలైన శుక్రవారం రోజే ఈ జబర్దస్త్ ఎపిసోడ్ కూడా ప్రసారం కానుంది. అయితే ఇప్పటికే విడుదలైన ఈ ఎపిసోడ్ ప్రోమోలో కిరాక్ ఆర్పీ.. వరుణ్ తేజ్, నాయిక మృణాళినికి బిస్కెట్లు వేసి నవ్వులు పూయించారు. అయితే, ఆర్పీ ఉపయోగించిన పదాలే మరింత హాస్యాన్ని పండించాయి.
వరుణ్.. మీరు జైల్లో ఉండాలి..
ప్రతి ఎపిసోడ్లో నాగబాబు, రోజా, యాంకర్లపై బిస్కెట్లు వేసే ఆర్పీ.. తాజా ఎపిసోడ్లో మాత్రం వరుణ్, మృణాళినికి బిస్కెట్లు వేసి నవ్వించారు. మీరు నవ్వుతుంటే ముత్యాలు రాలిపోతున్నాయంటూ ఆమెను నవ్వుల్లో ముంచారు. ఇక వరుణ్ తేజ్ పైనా భారీ బిస్కెట్ పంచ్ వేశారు. అమ్మాయిలకు నిద్రపట్టకుండా చేయడం నేరమే అయితే.. ఈ పాటికి మీరు తీహార్ జైల్లో తీవ్రవాదుల మధ్యలో ఉండాలని చెప్పాడు. దీంతో వరుణ్ తేజ్ నవ్వుతూ మురిసిపోయారు. నాగబాబు కూడా పెద్దగా వవ్వేశారు.
గద్దలకొండ గణేష్గా..
వాల్మీకి పేరుపై వివాదం చెలరేగడంతో ఈ చిత్రం పేరును మార్చారు. చిత్రంలో వరుణ్ తేజ్ పేరునే ఈ చిత్రానికి పెట్టారు. గద్దలకొండ గణేష్గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన వాల్మీకి చిత్రం సెప్టెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి టాక్ను సొంతం చేసుకుంది. వరుణ్ తేజ్, పూజా హెగ్డే ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. మృణాళిని మరో హీరోయిన్గా ఉంది.