Don't Miss!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- News చంద్రబాబు , భువనేశ్వరి ఆస్తుల్లో భారీ పెరుగుదల - 5 ఏళ్ల కాలంలోనే..!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మళ్ళీ కోర్టులో హాజరైన జబర్దస్త్ టీం
ఈటీవీలో ప్రసారం అవుతున్న బజర్దస్త్ టీంలోని నటులు శుక్రవారం హుజూరాబాద్ సబ్ కోర్టుకు హాజరయ్యారు. గతంలో 'జబర్దస్త్'లో ప్రసారమైన ఒక ఎపిసోడ్ న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా ఉందంటూ న్యాయవాది అరుణ్ కుమార్ ఈమేరకు ఒక పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే..'
జబర్ధస్త్ లో ఒకస్కిట్ లో న్యాయమూర్తులు, న్యాయవాదులు, భగవత్ గీతను కించపరిచారని ఆఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ప్రసారాల్లో భగవత్ గీత పై ప్రమాణం చేయమంటే ఒక్క గీత కాదు నాలుగు గీతలపై చేస్తానూ అంటూ భగవత్ గీతను కించపరిచారని కోర్టుకు విన్నవించారు.
ఈ అంశాలన్నింటిని పరిశీలించిన న్యాయమూర్తి జబర్ధస్త్ టీం యాంకర్లు అనసూయ, రష్మి, ప్రోగ్రామ్ జడ్జీ లు నాగేంద్రబాబు, ఎమ్మెల్యే రోజా, ప్రోగ్రాం ప్రొడ్యూసర్ శాంసుందర్ రెడ్డి తో పాటు కమెడియన్లు ఫణి, ధన్ రాజ్ లకు నోటీసులు జారీచేశారు.ఆ స్కిట్ లో పాల్గొన్న నటులనూ, నిర్వాహకులనూ,జడ్జీలనూ,యాంకర్ నూ హాజరు కావాల్సిందిగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసింది అదే కేసు విశయం లో జబర్దస్త్ ఆర్టిస్టులంతా హుజూరూరాబాద్ కోర్టు లో హాజరయ్యారు.
శుక్రవారం పచ్చ మధు, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, షేకింగ్ శేషు, నాగేశ్వర్ రావు, ఫణి కోర్టుకు హాజరైన వారిలో ఉన్నారు. అయితే నిర్మాత ఎం. శ్యాంప్రసాద్రెడ్డి, నాగబాబు, రోజా, రష్మీ, అనసూయ, మిగతా నటుల తరఫున న్యాయవాది ముక్కెర రాజు పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి విచారణకై న్యాయమూర్తి కంచె ప్రసాద్ కేసును జూన్ 30వ తేదీకి వాయిదా వేశారు....