Don't Miss!
- News అచ్చెన్నాయుడు ప్రత్యర్ధికి ఊరట-పోటీ నుంచి తప్పుకున్న భార్య..!
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
- Finance Amit Shah: ఆ కంపెనీల్లో అమిత్ షా పెట్టుబడులు.. హోం మంత్రి పోర్ట్ఫోలియోలో టాప్-10 స్టాక్స్ ఇవే
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
ఇంతకన్నా నీచుడు వుండడు, ప్రేక్షకులు క్షమించరు: జగపతి బాబు
Recommended Video
బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'సాక్ష్యం' . అభిషేక్ పిక్చర్స్ బ్యానర్పై అభిషేక్ నామా నిర్మాతగా.. శ్రీవాస్ దర్శతక్వంలో ఈ మూవీ తెరకెక్కించారు. ఫుల్లీ లోడెడ్ కమర్షియల్ ఎంటర్టెనర్గా తీసిన చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. ఆడియో ఆవిష్కరణ ఇటీవల హైదరాబాద్లో జరిగింది. జులై 27న సినిమాను విడుదల చేసేందకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో తాను పోషించిన విలన్ పాత్ర గురించి జగపతి బాబు మాట్లాడుతూ 'తన పాత్ర అత్యంత కిరాతకంగా, నీచంగా ఉంటుంది' అన్నారు.
వాటిని మించి పోయేలా ఉంటుంది
నేను ఇప్పటి వరకు లెజెండ్, నాన్నకు ప్రేమతో, జయ జానకి నాయక చిత్రాల్లో చెప్పుకోదగిన విలన్ పాత్రలు చేశాను. ఆ విలన్ పాత్రలకు మించి పోయేలా, భయంకరంగా ‘సాక్ష్యం'లో విలన్ పాత్ర ఉంటుంది అని జగపతి బాబు తెలిపారు.
ఇంతకన్నా నీచుడు వుండడు
తెరపై నేను పోషించిన విలన్ పాత్ర చూసిన ప్రేక్షకుడు ఇంతకన్నా నీచుడు వుండడు అనే భావనకు వస్తారని తెలిపారు. అలాంటి విలన్ గా నేను ఈ సినిమాలో కనిపిస్తాను... అని జగపతి వెల్లడించారు.
ప్రేక్షకులు క్షమించడం కష్టమే
ఇప్పటివరకూ నేను చేసిన విలన్ పాత్రలను ప్రేక్షకులు క్షమిస్తూ వచ్చారు, కానీ ఈ సినిమాలో విలన్ చేసే దారుణాలు చూసి ప్రేక్షకులు క్షమించడం కష్టమేనని అనిపిస్తోంది జగపతి బాబు తెలిపారు.
నా నిజ జీవితం మీద ప్రభావం చూపుతుందేమో?
‘సాక్ష్యం'లో నాది కేవలం డబ్బు గురించి మాత్రమే ఆలోచించే ఈ పాత్ర. ఇలాంటి పాత్ర చేయడం వల్ల ఆ ప్రభావం నా రియల్ లైఫ్ మీద పడుతుందేమో? ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు నా గురించి ఎలాంటి అభిప్రాయానికి వస్తారో? అని భయంగా ఉంద్నారు.