twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లక్ష్మీ వీర నరసింహ రాయలు గా జగపతిబాబు

    By Srikanya
    |

    ప్రియమణి ప్రధానపాత్రలో టి వేణుగోపాల్ ని దర్సకుడుగా పరిచయం చేస్తూ 'క్షేత్రం" చిత్రం బుధవారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి డా.డి.రామానాయుడు క్లాప్‌ను ఇవ్వగా, ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్ కెమెరా స్విచాన్ చేశారు. కె.నాగబాబు గౌరవ దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రంలో లక్ష్మీ వీరనరసింహరాయలు అనే పవర్‌ఫుల్ పాత్రను జగపతిబాబు పోషిస్తున్నాడు.అసలు ఫ్యాక్షన్ ఎలా పుట్టిందో, కుటుంబ విలువలు, దైవాత్మకమైన కథాంశంతో చిత్రం రూపొందుతుందని, దేవుడికి, ఫ్యాక్షనిజానికి గల సంబంధం ఏమిటన్నది ఈ చిత్రంలో వైవిధ్యంగా తెరకెక్కిస్తున్నామన్నారు.

    జగపతిబాబు మాట్లాడుతూ రాయలసీమ నేపథ్యంలో ఇలాంటి గెటప్‌తో సినిమా చేయడం ఇదే మొదటిసారి. ఓ మంచికథతో ఈ చిత్రం రూపొందుతోందని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ దర్శకుడు కథ చెప్పిన విధానం నచ్చి ఈ సినిమా చేయడం జరుగుతోందని, వైవిధ్యమైన ఓ మంచి సినిమాగా ఇది నిలుస్తుందని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ఈ కథ తయారుచేసుకొని నాలుగు సంవత్సరాలు దీనిపై వర్క్ చేశాను. నిర్మాత ఎక్కడ రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తానని ముందుకు వచ్చారు. ఈ కథలో దైవశక్తి ఉంది. ఈ చిత్రానికి తగ్గ నటీనటులు కుదిరారు. ప్రతి ఒక్క పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని వివరించారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X