Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
లక్ష్మీ వీర నరసింహ రాయలు గా జగపతిబాబు
ప్రియమణి ప్రధానపాత్రలో టి వేణుగోపాల్ ని దర్సకుడుగా పరిచయం చేస్తూ 'క్షేత్రం" చిత్రం బుధవారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి డా.డి.రామానాయుడు క్లాప్ను ఇవ్వగా, ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్ కెమెరా స్విచాన్ చేశారు. కె.నాగబాబు గౌరవ దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రంలో లక్ష్మీ వీరనరసింహరాయలు అనే పవర్ఫుల్ పాత్రను జగపతిబాబు పోషిస్తున్నాడు.అసలు ఫ్యాక్షన్ ఎలా పుట్టిందో, కుటుంబ విలువలు, దైవాత్మకమైన కథాంశంతో చిత్రం రూపొందుతుందని, దేవుడికి, ఫ్యాక్షనిజానికి గల సంబంధం ఏమిటన్నది ఈ చిత్రంలో వైవిధ్యంగా తెరకెక్కిస్తున్నామన్నారు.
జగపతిబాబు మాట్లాడుతూ రాయలసీమ నేపథ్యంలో ఇలాంటి గెటప్తో సినిమా చేయడం ఇదే మొదటిసారి. ఓ మంచికథతో ఈ చిత్రం రూపొందుతోందని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ దర్శకుడు కథ చెప్పిన విధానం నచ్చి ఈ సినిమా చేయడం జరుగుతోందని, వైవిధ్యమైన ఓ మంచి సినిమాగా ఇది నిలుస్తుందని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ఈ కథ తయారుచేసుకొని నాలుగు సంవత్సరాలు దీనిపై వర్క్ చేశాను. నిర్మాత ఎక్కడ రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తానని ముందుకు వచ్చారు. ఈ కథలో దైవశక్తి ఉంది. ఈ చిత్రానికి తగ్గ నటీనటులు కుదిరారు. ప్రతి ఒక్క పాత్ర పవర్ఫుల్గా ఉంటుందని వివరించారు.