Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
లక్ష్మీ వీర నరసింహ రాయలు గా జగపతిబాబు
ప్రియమణి ప్రధానపాత్రలో టి వేణుగోపాల్ ని దర్సకుడుగా పరిచయం చేస్తూ 'క్షేత్రం" చిత్రం బుధవారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి డా.డి.రామానాయుడు క్లాప్ను ఇవ్వగా, ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్ కెమెరా స్విచాన్ చేశారు. కె.నాగబాబు గౌరవ దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రంలో లక్ష్మీ వీరనరసింహరాయలు అనే పవర్ఫుల్ పాత్రను జగపతిబాబు పోషిస్తున్నాడు.అసలు ఫ్యాక్షన్ ఎలా పుట్టిందో, కుటుంబ విలువలు, దైవాత్మకమైన కథాంశంతో చిత్రం రూపొందుతుందని, దేవుడికి, ఫ్యాక్షనిజానికి గల సంబంధం ఏమిటన్నది ఈ చిత్రంలో వైవిధ్యంగా తెరకెక్కిస్తున్నామన్నారు.
జగపతిబాబు మాట్లాడుతూ రాయలసీమ నేపథ్యంలో ఇలాంటి గెటప్తో సినిమా చేయడం ఇదే మొదటిసారి. ఓ మంచికథతో ఈ చిత్రం రూపొందుతోందని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ దర్శకుడు కథ చెప్పిన విధానం నచ్చి ఈ సినిమా చేయడం జరుగుతోందని, వైవిధ్యమైన ఓ మంచి సినిమాగా ఇది నిలుస్తుందని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ఈ కథ తయారుచేసుకొని నాలుగు సంవత్సరాలు దీనిపై వర్క్ చేశాను. నిర్మాత ఎక్కడ రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తానని ముందుకు వచ్చారు. ఈ కథలో దైవశక్తి ఉంది. ఈ చిత్రానికి తగ్గ నటీనటులు కుదిరారు. ప్రతి ఒక్క పాత్ర పవర్ఫుల్గా ఉంటుందని వివరించారు.