Don't Miss!
- Sports T20లో డబుల్ సెంచరీ: ఆ భారత ప్లేయర్కే సాధ్యం- విలియమ్సన్
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- News తెలంగాణలో నామినేషన్లను దాఖలు చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రిలీజ్ కి అడ్డం పడ్తున్న హీరో?
జగపతిబాబు, మీరాజాస్మిన్ కాంబినేషన్లో జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో దాసరి బంగారుబాబు సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది..వాయిదాల మీద వాయిదాలు పడ్తోంది. కారణం మార్కెట్ కాకపోవటం అనే టాక్ బయిట ఉంది. అయితే అదే కాకుండా మరో కారణం ఉందంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది. అది మరేదో కాదు ఆ చిత్రం హీరో జగపతిబాబే స్వయంగా రిలీజ్ కాకుండా అడ్డుపడుతున్నాడని, క్లియరెన్స్ సర్టిఫికేట్ మీద సైన్ కూడా చెయ్యాలేదని సమాచారం. ఎందుకు అడ్డుపడుతున్నాడనే దానికి కారణం కూడా వినపడుతోంది. ఆ చిత్రంలో ఉన్న పాటలన్ని జగపతిబాబు తన మీదే తీస్తారని భావించారు.
అయితే ఆడియో రోజున మరో పాట వినపడి దర్శక, హీరోలు కంగారుపడ్డారు. ఆ పాటని సెకెండ్ హీరోమీద చిత్రీకరించాలని దాసరి నిర్ణయించారని, అయితే ముందుగా చెబితే జగపతి ఒప్పుకోడని దాచాడని అంటున్నారు. అలాగే ఎడిగింగ్ లో జగపతి మీద చాలా సన్నివేశాలు ఎడిటింగ్ టేబుల్ పై తీసేసారని తెలుస్తోంది. దాంతో ఆ పాట విషయం సెటిల్ చేసి, ఆ తీసేసిన సన్నివేశాలు కలిపితేనే రిలీజ్ కి ఒప్పుకుంటానని జగపతి చెప్పినట్లు చెప్తున్నారు. అసలు ఈ చిత్రం షూటింగ్ లోనే ఇబ్బంది ఎదురైంది. ఆ మధ్య షూటింగ్ సందర్భంగా కాశ్మీర్ వెళ్ళినప్పుడు అక్కడ అల్లర్లు చెలరేగాయి.
అయితే దాసరి సమయస్ఫూర్తితో వ్యవహరించి యూనిట్ మొత్తాన్ని సేఫ్ గా హైదరాబాద్ కు రప్పించగలిగారు. జగపతిబాబు సమయం సందర్భం వచ్చినప్పుడల్లా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. కానీ సినిమా నిర్మాణం పూర్తయి రిలీజ్ సమయం వచ్చేసరికి ఈ ట్విస్ట్ ఇచ్చారు జగపతిబాబు.ఇక జగపతిబాబు నటిస్తున్న 'అధిపతి' కూడా ఈనెల 10న విడుదలకు సిద్ధమవుతోంది.