Don't Miss!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నా ఫ్యాన్స్ ఇబ్బందిగా ఫీలవుతున్నారు: జగపతిబాబు
హైదరాబాద్ : 'శింతాండవం'లో నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర చేశాను. బేసిక్గా నేను నెగటివ్ పర్సన్ కాదు కాబట్టి ఈ పాత్రలో చూడటానికి అభిమానులు కొంత ఇబ్బందిగా ఫీలవుతున్నారు. ముందు జీర్ణించుకోలేకపోయినా, ఆ పాత్ర నెగటివ్గా మారడానికి సరైన కారణం ఉంది. అందుకని చూస్తున్నారు'' అన్నారు జగపతి బాబు. . విక్రమ్, జగపతిబాబు కాంబినేషన్లో రూపొందిన 'శివతాండవం'గత శుక్రవారం విడుదలైంది. చిత్రం ప్రమోషన్ లో భాగంగా జగపతిబాబుమీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.
అలాగే ''నటుడికి పరిమితులంటూ ఏమీ ఉండకూడదు. శివతాండవం కథ వినగానే నటించేందుకు ఒప్పుకొన్నా. దర్శకుడు కథ తయారు చేసుకొని సరాసరి నా దగ్గరికే వచ్చాడు. వాళ్లు అనుకొనుంటే ఆ పాత్రకు వేరెవర్నైనా తీసుకోవచ్చు. కానీ నాపై నమ్మకంతో నన్ను సంప్రదించారు. ఇలాంటి కథల్లో నటిస్తే... తెలుగులోనూ నా కెరీర్కి మేలు జరుగుతుందనే నమ్మకంతో ఈ సినిమా ఒప్పుకొన్నా'' అన్నారు.
''యూటీవీ, విక్రమ్, చిత్రదర్శకుడు విజయ్, ఛాయాగ్రాహకుడు నిరవ్ షా. ఇంత భారీ టీమ్తో సినిమా ప్లాన్ చేశారు కాబట్టి కచ్చితంగా బాగుంటుందనుకున్నాను. అలాగే ఈ సినిమా చేయడం ద్వారా నాకు తమిళ్లో మంచి ఎంట్రీ దొరుకుతుంది. అంతకుముందు నా డబ్బింగ్ సినిమాలు అక్కడ విడుదలైనా, ఇది భారీ చిత్రం కాబట్టి ఇంకా గుర్తింపు వస్తుందని నమ్మాను. అది నిజమైంది'' అని వివరించారు.
'శివతాండవం'కి తమిళ్లోకన్నా ఈ సినిమాకి తెలుగులో మంచి ఆదరణ లభిస్తోంది. నిజానికి ఇంత ఆదరణ రావడానికి ముఖ్య కారణం నేనే. 'జగపతిబాబు విలన్గా చేశాడా?.. ఎందుకు చేశాడు?' అనే చర్చ జరిగింది. ఆ ఆసక్తితో ఈ సినిమాకి వస్తున్నారు. అఫ్కోర్స్ విక్రమ్ హయ్యస్ట్ గ్రాసర్. అలాగే ఈ సినిమాని కళ్యాణ్ ఎక్కువ థియేటర్లలో భారీగా విడుదల చేశాడు. ఫస్ట్ 'ఎ' సెంటర్ సినిమా అన్నారు. ఆ తర్వాత ఫ్యామిలీ డ్రామా ఉందని తెలుసుకుని అందరూ చూస్తున్నారు. నేను ఎక్స్పెక్ట్ చేయని గాజువాక, రాజమండ్రి, కాకినాడలాంటి ఏరియాల్లో కూడా ఈ సినిమా బాగా ఆడుతోంది అని చెప్పుకొచ్చారు.