Don't Miss!
- Sports హార్దిక్కు అంబానీ వార్నింగ్.. సంచలన నిర్ణయానికి సిద్ధం!
- News రిజల్ట్ తరువాత సీఎం కుర్చీ హుష్ కాకి, హైకమాండ్ వెయిటింగ్, గాలి జనార్దన్ రెడ్డి సంచలనం
- Finance Adani-Birla: అదానీని టార్గెట్ చేసిన బిర్లా.. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ కొనుగోలు..
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
జగపతి బాబు కెరీర్ లో తొలిసారిగా...
జగపతి బాబు కెరీర్లోనే తొలిసారిగా జనవరి ఒకటిన విడుదలవుతున్న సినిమా ఇదే. ప్రపంచవ్యాప్తంగా 90 ప్రింట్లు, 150 థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అంటూ 'మా నాన్న చిరంజీవి' గురించి విశాఖ టాకీస్ అధినేత నట్టి కుమార్ చెప్పుకొచ్చారు. ఆయన ఈ చిత్రం ప్రపంచవ్యాప్త ప్రదర్శన హక్కుల్ని పొందారు. జయశ్రీ సమర్పణలో లాఫింగ్ లార్డ్ ఎంటర్టైన్మెంట్స్ పై అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో రూపొందించారు. అంతకు ముందు అరుణ్ ప్రసాద్..పవన్ కళ్యాణ్ హీరోగా తమ్ముడు చిత్రాన్ని డైరక్ట్ చేసారు. ఈ చిత్రం జనవరి 1న విడుదలవుతుంది. ఈసందర్బంగా నట్టికుమార్ మీడియాతో మాట్లాడారు.
తల్లి దూరమైన కొడుకుని ఓ తండ్రి ఎలా పెంచాడు, వాళ్లిద్దరి మధ్యా ఎంతటి గాఢానుబంధం ఏర్పడింది, చివరికి ఆ తల్లి వాళ్లకి దగ్గరయ్యిందా, లేదా? అనే కాన్సెప్టుతో ఈ చిత్రాన్ని అరుణ్ప్రసాద్ రూపొందించారు. తండ్రిని కొడుకు ఎలా ఒక రోల్మోడల్గా భావిస్తాడో ఈ సినిమాలో చూడొచ్చు. ఆ కొడుక్కి తండ్రి 'ఒక పేద్ద హీరో'. ఒక హాలీవుడ్ హిట్ ఫిల్మ్ ప్రేరణతో ఈ చిత్రాన్ని ఆయన తీశారు అంటూ ఈ చిత్రం కథ గురించి చెప్పుకొచ్చారు. ఇక ఆయన తన భవిష్యత్ కార్యాచరణ గురించి చెపుతూ...అగ్ర హీరోలు, అగ్ర దర్శకులతో నేను తీస్తున్న సినిమాలు 2010లో ఐదు విడుదల కాబోతున్నాయి. నట్టికుమార్ గతంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన అడవి చిత్రాన్ని రిలీజ్ చేసారు.