Don't Miss!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
ముదురు జంటతో లవ్ స్టోరీ తీసారా?
హైదరాబాద్ : కొత్త జంట లవ్ స్టోరీని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. అలాంటిది ముదురు జంట జగపతిబాబు, భూమిక లవ్ స్టోరీ ప్రేక్షకులు చూస్తారా అంటున్నారు సినీ వర్గాలు. జగపతిబాబు, భూమిక జంటగా నటించిన చిత్రం 'ఏప్రిల్ ఫూల్'. కె.ఎస్.ఐ దర్శకుడు. జి.ఎల్.శ్రీనివాస్ నిర్మాత. ఈ నెల 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇదో లవ్ స్టోరీ అని దర్శక,నిర్మాతలు ఓ రేంజిలో పబ్లిసిటీ చేస్తున్నారు. నిన్న ఆదివారం హైదరాబాద్లో ఈ చిత్ర ప్లాటినమ్ డిస్క్ వేడుక జరిగింది.
దర్శకుడు మాట్లాడుతూ ''ఓ న్యాయవాదికీ, పాత్రికేయురాలికీ మధ్య జరిగిన ప్రేమకథ ఇది. ఎవరు ఎవరిని 'ఏప్రిల్ ఫూల్' చేశారన్నది ఆసక్తికరం. వినోదం, కుటుంబ బంధాలూ మేళవించాం. ప్రతీ సన్నివేశం సహజంగా ఉంటుంది. జగపతి బాబు, భూమికల జంట ఆకట్టుకొంటుంది''అన్నారు. ''కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుందీ చిత్రం. బంటి సంగీతం ప్రధాన ఆకర్షణ'' అని నిర్మాత చెప్పారు.
నిర్మాత మాట్లాడుతూ "జగపతిబాబు,భూమిక లు జంటగా మా బ్యానర్ లో సోషియో ఫాంటసీ అబ్సర్డ్ కామెడిగా రూపొందిన చిత్రం ఏప్రిల్ ఫూల్ ఈ చిత్రంలో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే చక్కటి సన్నివేశాలు నవ్వులు కురిపించటమే కాకుండా కొత్తగా ఉంటాయి. " లెజెండ్ '' చిత్రంతో నటిడిగా తన ప్రతాపాన్ని మరో సారి వైవిధ్యంగా చూపించిన జగపతిబాబు ఈ చిత్రంలో చాలా అందంగ ఉంటూ తన అద్భుతమైన నటనతో అలరించారు. ఫ్యామిలీ అడియన్స్ ను అలరిస్తూనే ఎవ్వరూ ఊహించని టిస్ట్ లు ఈ చిత్రంలో ఉంటాయి. అలాగే చాలా గ్యాప్ తరువాత భూమిక తన అందమైన నటనను ప్రదర్శించిది తనికెళ్ళ రాజేంద్రప్రసాద్ అతన అందమైన కెమరా వర్క్ ఈ చిత్రంలో చూపించారు. బంటి అందించిన ఆడియోకు ఇప్పటికే మంచి స్పందన వస్తుంది అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను మే 10న విడుదల చేయనున్నాము అన్నారు.
ఈ సినిమాలోని మిగిలిన పాత్రల్లో గుల్షన్ గ్రోవర్,రన్ ధీర్, శ్రుతి,రాళ్ళపల్లి, ప్రీతి, వైజాగ్ ప్రసాద్ ,తాగుబోతు రమేష్, ధన్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాతః జి.ఎల్.శ్రీనివాస్, దర్శకత్వం: డాక్టర్ కె.యస్.ఐ, కెమెరాః తనికెళ్ళ రాజేంద్రప్రసాద్, సంగీతం:బంటి, పాటలుః బి.మధు.