Don't Miss!
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
జగపతిబాబు కొత్త చిత్రంలో మీడియా వారే ప్రధానం
జగపతిబాబు తాజాగా 'కీ" అనే కొత్త చిత్రం కమిటయ్యారు. డ్రీమ్ థియేటర్ ప్రొడక్షన్స్ పతాకంపై నాగేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో సుకుమార్రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవ సన్నివేశాన్ని హైదరాబాద్ నానక్రామ్గూడలో చిత్రీకరించారు. ప్రారంభోత్సవ సన్నివేశాన్ని జగపతిబాబుపై చిత్రీకరించగా నట్టికుమార్ స్విచాన్ చేశారు. బివిరెడ్డి క్లాప్ ఇచ్చారు. రామసత్యన్నారాయణ తొలి షాట్కి గౌరవ దర్శకత్వాన్ని చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నిర్మాత సుకుమార్రెడ్డి మాట్లాడుతూ- జగపతిబాబు ఫ్రధాన పాత్రలో పౌరుల బాధ్యతలు తెలిపే విధంగా ఈ చిత్రంలో నటిస్తారు.
చిత్రదర్శకుడు నాగేంద్రప్రసాద్ మాట్లాడుతూ- తొలిచిత్రాన్ని జగపతిబాబుతో తీయడం సంతోషంగా ఉంది. ఈ చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్గా ఉంటుంది. మైండ్ గేమే ప్రధానాంశంగా చిత్ర కథ సాగుతుంది. ఈ చిత్రంలో మీడియా సహకారం ఎక్కువగా ఉన్నందువల్ల మీడియాకు సంబంధించినవారు చాలామంది నటిస్తారని తెలిపారు. స్వప్న, సోనియా, దీప్తివాజపాయి, అల్త్ఫా, ధనుంజయ్, సంపత్ తదితరులు నటిస్తన్న ఈ చిత్రానికి కెమెరా: పి.జి.వింద, సంగీతం: విజయ్ కూరాకుల, నిర్మాత: సుకుమార్రెడ్డి, దర్శకత్వం: నాగేంద్రప్రసాద్. వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.