Don't Miss!
- News వైసీపీలోకి జనసేన మఖ్య నేతలు - పిఠాపురం పై గురి..!!
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Technology Truecaller Spam Model స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
అమితాబ్ కు తక్కువ షారుఖ్, సల్మాన్ లకు ఎక్కువైన జగపతి బాబు...
ఓ టైమ్ లో 'ఆంధ్రా అమితాబ్" అని పిలిపించుకోవడానికి బాగా ఇష్టపడే వాడు జగపతిబాబు. మరి ఇప్పుడు 'అమితాబ్ బచ్చన్ కన్నా ఏం తక్కువ నీకైనా " అంటూ ఎవరైనా ఉబ్బించారో, లేక షారుఖ్, సల్మాన్ లు కూడా చేసిందేగా నువ్వూ ఓ ట్రయల్ వెయ్యమంటూ డబ్బిచ్చారో ఇంకా తెలీలేదు కానీ మొత్తానికి బాబుగారు బుల్లి తెరపై పాదం మోపుతున్నారు. ఈ టీవీలో ప్రసారం కాబోతున్న 'రాజు రాణి అండ్ జె" ప్రోగ్రామ్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న జగపతి బాబు గురించి 'బుల్లి తెరపై అడుగిడుతోన్న వెండితెర సూపర్ స్టార్" అంటూ ప్రస్తుతం మనం ఉలిక్కిపడే రేంజ్ లో ఊదరగొడుతున్నారు సదరు ఛానల్ వారు..పోన్లెండి..జగపతి బాబు ఇక్కడైనా సూపర్ స్టార్ అనిపిచుకోగలిగినందుకు ఆయన మహిళాభిమానులు ఆనందిస్తారేమో.
ఇంతకీ ఏమిటా ప్రోగ్రామ్, అందులో విశేషమేంటని ఆరాతీస్తే భార్య, భర్తలను ఆహ్వానించి వాళ్ళతో టాక్ షో నిర్వహించనున్నారట జగపతి బాబు ఈ ప్రోగ్రామ్ టైటిల్ లో 'రాజు రాణి" పక్కన తన పేరుని సింపుల్ గా 'జె" అని పెట్టుకున్నట్టో లేక 'జె" అంటే జాకీ అనో ఇంకా కన్ఫర్మ్ చెయ్యలేదు. అయితే జగపతి అయినా జాకీ అయినా ఓకే అంటూ బుల్లితెర వ్యాఖ్యాతగా కొత్త జర్నీ స్టార్ట్ చేస్తోన్న జగపతి బాబుకి ఆయన అభిమానులు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.