twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కడుపు మంటతో సినిమా చేసాను': జగపతి బాబు

    By Srikanya
    |

    జగపతి బాబు తాజాగా తన చేసిన 'చట్టం'...నీ అబ్బ సొత్తా చిత్రం గురించి మాట్లాడుతూ..ఈ చిత్రాన్ని తాను కడుపుమంటతో చేసానని అన్నారు. క్రిందటి శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. అందులో మాట్లాడుతూ...విచారణ పేరుతో సకల సౌకర్యాలూ అందించి తీవ్రవాదులకు మర్యాద చేస్తున్నాం. న్యాయస్థానాల్లో కాలయాపన జరుగుతోంది. కసబ్‌లాంటి తీవ్రవాదిని కూడా ఇంటల్లుడిలా చూడ్డం మన దౌర్భాగ్యం. ఆ కడుపు మంటతో తీసిన సినిమా చట్టం అన్నారు. అలాగే క్లైమాక్స్ సన్నివేశాల్లో నేను బాగా చేశాను అని చెబుతున్నారు. అది నా గొప్పదనం కాదు. ఏ భారతీయుడికి ఆ పాత్ర ఇచ్చినా ఇంతే బాగా చేయగలడు. ఎందుకంటే ఆ ఎమోషన్స్ అన్నీ మనందరి మనసుల్లో ఉండేవే అన్నారు.

    ఇక నిర్మాత నట్టికుమార్‌ చెబుతూ...నాలుగొందల ప్రింట్లతో విడుదల చేసిన సినిమా ఇది. అందుకే థియేటర్‌కి 30 శాతం వసూళ్లు వచ్చినా చాలు. మా సినిమా హిట్ అయినట్లే అన్నారు. కసబ్, అతని అనుచరులు కలిసి హోటల్లో ఎంతమందిని మారణహోమంలో పొట్టనపెట్టుకున్నదీ మనకు తెలిసిందే. అప్పుడు ప్రతి భారతీయుడు కసబ్‌ను శిక్షించాలని అనుకున్నవాడే. ఈ చిత్రం ప్రతి భారతీయుడిని కదిలిస్తుందని నమ్ముతున్నామని దర్శకుడు పి.అరుణ్ ప్రసాద్ తెలిపారు.క్లైమాక్స్ సన్నివేశాల్లో జగపతి బాబు మంచి నటన కనబరిచారని, ఇది ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా అని రాజశేఖర్‌, జీవిత చెప్పారు. ఈ కార్యక్రమంలో తరుణ్‌,శ్రీలేఖ, విమలారామన్‌, అరుణ్‌ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

    English summary
    Jagapathi Babu’s latest telugu cinema Chattam… Nee Abba Sottha' has released with Flop talk. Vimala Raman is playing Female lead in this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X