twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డైరక్ట్ గా ఏం చేయలేకే సినిమాలపై

    By Staff
    |

    Jagmohan Mundra
    ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు..తలనొప్పిగా తయారైన ఉగ్రవాదాన్ని ఏం చేయలేని పాకిస్థాన్ ఇండియన్ సినిమాలపై నిషేధం ప్రకటిస్తూ..తన కక్ష తీర్చుకుంటోంది. ముంబయిలో పాకిస్థాన్‌ ఉగ్రవాదుల దాడి దరిమిలా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం తాజాగా వినోద రంగంపై కూడా పడింది. భారత్‌కు చెందిన బాలీవుడ్‌ చిత్రం 'షూట్‌ ఎట్‌ సైట్‌'పై పాకిస్థాన్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ సినిమాలో పాకిస్థాన్‌ నటుడు మికాల్‌ జుల్ఫికర్‌ను ఉగ్రవాదిగా చూపించడమే నిషేధానికి కారణమైంది.

    ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌లో ఇప్పటికే 75 శాతం బాలీవుడ్‌ సినిమాలకు వ్యాపారం పడిపోయింది. పాకిస్థాన్‌ సాంస్కృతికశాఖ సూచన మేరకు ఆదేశ సెన్సార్‌ బోర్డు ఈ చిత్ర ప్రదర్శనను నిషేధించింది. బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌ తాజా చిత్రం ''రబ్‌ నే బనా ది జోడి'' చిత్రాన్ని విడుదల చేసేందుకు పాకిస్థాన్‌ పంపిణీదారులెవ్వరూ ముందుకు రావడంలేదు. ''షారుక్‌ ఖాన్‌ పెద్ద పేరున్న, మార్కెట్‌ ఉన్న కథానాయకుడే. అయితే ప్రస్తుత తరుణంలో అధిక మొత్తంలో డబ్బు వెచ్చించి చిత్ర ప్రదర్శన హక్కులు తీసుకోవడానికి పంపిణీదారులు జంకుతున్నారు''అని సానౌల్లా ఖాన్‌ అనే పంపిణీదారు పేర్కొన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X