Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
'జై బోలో తెలంగాణ' నైజాం కలెక్షన్స్ పరిస్ధితి ఏంటి?
ఎన్.శంకర్ దర్శకత్వంలో రూపొందిన జై బోలో తెలంగాణా చిత్రం నైజాం ఏరియాల్లో కలెక్షన్స్ వర్షం కురిపిస్తోందని ట్రేడ్ వర్గాల సమాచారం. దాదాపు మూడున్నర కోట్ల రూపాయల వరకూ ఈ చిత్రం వసూలు చేయనున్నదని చెప్తున్నారు. అలాగా నైజాం ప్రాంతంలో ఇప్పుడిప్పుడే తీసేసే అవకాసం లేదని లాంగ్ రన్ నడుస్తుందని, ధియోటర్ల యజమానులు కూడఈ చిత్రాన్ని ఉత్సాహంగా ప్రదర్శిస్తున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా గద్దర్ పాటను ప్రతీ షోకు ధియోటర్లలో రెండు మూడు సార్లకు పైగా వేస్తున్నారని అది చాలు ఈ చిత్రం ఏ రేంజి విజయం సాధించిందో అంచనావేసేందుకు అంటున్నారు. ప్రత్యేక తెలంగాణా అంశం ప్రస్దావిస్తూ వచ్చిన ఈ చిత్రంలో సందీప్, మీరా నందన్, స్మృతి ఇరానీ, నాగినీడు ముఖ్యపాత్రల్లో చేసారు. ఇక జగపతిబాబు చేసింది గెస్ట్ గా అయినా సినిమాకు కీలకమై నిలిచారు. కొద్ది క్షణాలే కనిపించిన కేసీఆర్ సైతం చిత్రంలో ప్రధాన ఆకర్షణ అయ్యారు.