Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘జై లవ కుశ’: లీకైన టైటిల్ సాంగ్ ఇదే (వీడియో)
ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ టైటిల్ సాంగ్ లీక్ అయింది. రావణ అంటూ సాగే ఈ పాట సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'జై లవ కుశ' సినిమా రిలీజ్ ముందే లీక్ అవుతూ నిర్మాతలను కంగారు పెడుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలు పోషిస్తుండగా కొన్ని రోజుల క్రితం 'జై' పాత్రను పరిచయం చేస్తూ టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ రిలీజ్ ముందే ఆన్ లైన్లో లీక్ అయింది.
ఈ లీక్ విషయమై నిర్మాత కళ్యాణ్ రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానికి బాధ్యుడైన గణేష్ ను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ సంఘటన తర్వాత వెంటనే 'జై' టీజర్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. తాజాగా 'జై లవ కుశ' చిత్రానికి సంబంధించి మరో లీక్ జరిగిపోయింది.
టైటిల్ సాంగ్ లీక్
తాజాగా సినిమాలోని 'రావణ..' అనే సాంగ్ లీక్ అయింది. జై పాత్ర కోసం ఈ పాటను కంపోజ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ వీడియో యూట్యూబ్లో పెట్టడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
జై టీజర్కు ఊహించని స్పందన
ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలు పోషిస్తుండగా ‘జై' అనే పాత్ర రావణుడిలా విలనిజంతో కూడిన పాత్ర. ఈ పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన ‘జై' టీజర్కు మంచి స్పందన వచ్చింది.
సౌతిండియా రికార్డ్
‘జై' టీజర్ 24 గంట్లోలనే 7.8 మిలియన్ వ్యూస్ సాధించి...... సౌతిండియాలో ఫాస్టెస్ట్ వ్యూస్ సాధించి టీజర్గా రికార్డులకెక్కింది.
ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్
‘జై లవ కుశ' చిత్రాన్ని సెప్టెంబర్ 21న విడుదల చేసేందకు ప్లాన్ చేస్తున్నారు. ఈ గ్యాపులో లవ, కుశ పాత్రలను పరిచయం చేస్తూ టీజర్లు, సినిమా ట్రైలర్ వరుస పెట్టి విడుదల చేయబోతున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. రాశీ ఖన్నా, నివేదా థామస్ నాయికలు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.