Don't Miss!
- News అభ్యర్దుల మార్పు పై చంద్రబాబు కీలక నిర్ణయం - ఆ నేతలకు పిలుపు..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
ఎన్టీఆర్ జై టీజర్ డిజిటల్ సునామీ... అవలీలగా కోటి!
జై లవకుశ మూవీ జై టీజర్ 1 కోటి వ్యూస్ మార్కును అందుకుంది. కేవలం 48 గంటల్లోనే ఈ ఘనత సాధించింది.
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ 'జై లవ కుశ' చిత్రానికి సంబంధించిన 'జై టీజర్' క్రియేట్ చేసిన డిజిటల్ సునామీ దెబ్బకు సౌతిండియా రికార్డులన్నీ బద్దలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ 24 గంటల్లో 7.8 మిలియన్ వ్యూస్ సాధించగా... 48 గంట్లోనే అవలీలగా 1 కోటి మార్కను అందుకుంది.
ఈ విషయాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు అఫీషియల్ ట్విట్టర్ పేజీ ద్వారా ప్రకటించారు. సెన్సేషనల్ రెస్పాన్స్ తో జై టీజర్ ను రికార్డ్ బ్రేకింగ్ టీజర్ గా మార్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
1 Crore Digital Videos in less than 48 hours for #RecordBreakingJaiTeaser. Thank you everyone for this sensational response 🙏🏻 pic.twitter.com/8IFFPLXOdv
— NTR Arts (@NTRArtsOfficial) July 8, 2017
'జై లవ కుశ' మూవీలో ఎన్టీఆర్ 3 విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు. అందులో జై క్యారెక్టర్ రావణుడి తరహాలో విలన్ పాత్రను పోలి ఉంటుంది. టీజర్లో ఎన్టీఆర్ తనదైన విలనిజాన్ని ప్రదర్శించి అభిమానులను మెప్పించారు.
బాబీ దర్శకత్వం వహిస్తెున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ట్స్ బేనర్లో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్లో దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. జై టీజర్కు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఎన్టీఆర్ కెరీర్లోనే మరో బిగ్గెస్ట్ హిట్ ఖాయంగా కనిపిస్తోంది.