Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఎన్టీఆర్ జై టీజర్ డిజిటల్ సునామీ... అవలీలగా కోటి!
జై లవకుశ మూవీ జై టీజర్ 1 కోటి వ్యూస్ మార్కును అందుకుంది. కేవలం 48 గంటల్లోనే ఈ ఘనత సాధించింది.
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ 'జై లవ కుశ' చిత్రానికి సంబంధించిన 'జై టీజర్' క్రియేట్ చేసిన డిజిటల్ సునామీ దెబ్బకు సౌతిండియా రికార్డులన్నీ బద్దలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ 24 గంటల్లో 7.8 మిలియన్ వ్యూస్ సాధించగా... 48 గంట్లోనే అవలీలగా 1 కోటి మార్కను అందుకుంది.
ఈ విషయాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు అఫీషియల్ ట్విట్టర్ పేజీ ద్వారా ప్రకటించారు. సెన్సేషనల్ రెస్పాన్స్ తో జై టీజర్ ను రికార్డ్ బ్రేకింగ్ టీజర్ గా మార్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
1 Crore Digital Videos in less than 48 hours for #RecordBreakingJaiTeaser. Thank you everyone for this sensational response 🙏🏻 pic.twitter.com/8IFFPLXOdv
— NTR Arts (@NTRArtsOfficial) July 8, 2017
'జై లవ కుశ' మూవీలో ఎన్టీఆర్ 3 విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు. అందులో జై క్యారెక్టర్ రావణుడి తరహాలో విలన్ పాత్రను పోలి ఉంటుంది. టీజర్లో ఎన్టీఆర్ తనదైన విలనిజాన్ని ప్రదర్శించి అభిమానులను మెప్పించారు.
బాబీ దర్శకత్వం వహిస్తెున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ట్స్ బేనర్లో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్లో దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. జై టీజర్కు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఎన్టీఆర్ కెరీర్లోనే మరో బిగ్గెస్ట్ హిట్ ఖాయంగా కనిపిస్తోంది.