‘జల్లు’ రేపే విడుదల
వి.వి.నారాయణ దర్శకత్వం లో "రేచర్ల మూవీ క్రియేషన్స్" పతాకంపై రేచర్ల సుభాష్ నాయుడు నిర్మించిన తొలి చిత్రం 'జల్లు". జూలై 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అమెరికాలో చికాగోలో సిఎమ్ ఇ గ్రూఫ్ సాప్ట్ వేర్ ఉద్యోగి జయంత్ ఫృధ్విరాజ్ కధానామకుడుగా పరిచయమౌతున్నారు. పాటలు అనంత్ శ్రీరామ్ వ్రాయగా, నిహాల్ మ్యూజిక్ ను అందించగా, బాలు, సునీత, హేమచందర్, వేణు, ప్రణవీల గాత్రంతో ప్రేక్షకులను వీనుల విందు చేయనున్నారు. ఇక కథ విషయానికొస్తే ప్రపంచ దేశాలని కదిలిస్తున్న సమస్యని దృష్టిలో ఉంచుకొని యువతకు ఒక సందేశాత్మకంగా తెరకెక్కించారని తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందని దర్శక, నిర్మాతలు అన్నారు. ఇక పోతే కెమెరా జోషి, రేడియోమిర్చి భూపాల్. ఇతర పాత్రల్లో రావు రమేష్ ముఖ్యపాత్ర వహించారు.
More from Filmibeat
jallu anantha sriram prithviraj software engineer prerana vv narayana సుభాష్ నాయుడు జయంత్ ఫృధ్విరాజ్ జల్లు భూపాల్ సాప్ట్ వేర్ ఉద్యోగి


Click it and Unblock the Notifications











