Don't Miss!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
నీ సినిమాలో నాడైలాగులు
తెలుగు సినిమా రంగంలో స్నేహపూరిత వాతవరణం నెలకొనింది. మనం అందరం ఒకటి అంటున్నారు. ఇది మంచి సాంప్రదాయం అంటున్నారు కోందరు పెద్దలు. ఇదే విధంగా వుంటే రానున్న రోజులలో మల్టీస్టారర్ సినిమాలు చూడవచ్చని అభిమానులు అంటున్నారు. తాము నటించిన సినిమాలలో కాకుండ మరో హీరో నటించిన సినిమాలలో తమ గోంతుతో మరో హీరో అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
పవన్ కల్యానజల్సాలో ప్రిన్స్ మహేష్ బాబు, అల్లుడు అల్లు అర్జున్ పై అభిమానంతో చిరంజీవి వరుడులో ఓవర్ వాయిస్ ఇచ్చారు. కలక్షన్ కింగ్ మోహన్ బాబు నా రూటే సపరేటు అంటారు. అలాంటి ఆయన బోమ్మాళి 'అనుష్కా" నటించిన 'పంచాక్షరి"లో వాయిస్ ఇచ్చారు. ఈయన ఓవర్ వాయిస్ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని అంటున్నారు. అదే విధంగా రామరామకృష్టకృష్ణ సినిమాలో జూనియర్ 'ఎన్టీఆర్" వ్యాఖ్యానం చెప్పారు.
'వెంకటేష్" నటించిన చింతకాయలరవిలో 'ప్రకాష్ రాజ్", నితిన్ నటించిన 'విక్టరీ"లో జగపతి బాబు, పూరిజగన్నాధ్ తనశిష్యుడు తీస్తున్న యవత కోసం వాయిస్ ఇచ్చారు. శ్రీను వైట్ల ఈ విషయంలో ముందు వుంటారు. దుబాయ్ శీను, ఢీ, నమో వెంకటేశ సినిమాలలో తన ఓవర్ వాయిస్ ఇచ్చారు. వివి వినాయక్ 'శంభోశివశంభో "సినిమాలో వ్యాఖ్యానం చేశారు. ఇదే విధంగా పలువురు ఇతర హీరోలు నటిస్తున్న సినిమాలకు ఓవర్ వాయిస్ ఇచ్చారు. ఇది ఇప్పటి సాంప్రదాయం కాదు. బ్లాక్ అండ్ వైట్ సినిమాలలో మెదలైయ్యింది. ఎన్టీఆర్ నటించిన 'మళ్లీశ్వరీ" సినిమాలో 'చిత్తూరు నాగయ్య"తో ఈ సాంప్రదాయం మెదలైయ్యింది.